Miss World 2025:  నేడు పోచంపల్లి, యాదగిరిగుట్టకు అందాల భామలు

హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొంటున్న అందగత్తెలు బుధవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. దానికి తగినట్లు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

New Update
 Miss World 2025 Telangana

Miss World 2025 Telangana

Miss World 2025: హైదరాబాద్‌(Hyderabad) కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. సుమారు 150 దేశాల నుంచి ఆయా దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొంటున్న అందగత్తెలు రోజుకో ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. బుధవారం వరంగల్‌ జిల్లాలో(Warangal District) పర్యటించిన సుందరీమణులు నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో(Yadadri Bhuvanagiri District) పర్యటించనున్నారు. దానికి తగినట్లు ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

కాగా గురువారం మిస్ వరల్డ్ పోటీదారులు ఇవాళ(గురువారం) రెండు ప్రాంతాల్లో పర్యటిస్తారు.  టూరిజం విలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. ఈ సందర్శనలో  ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల ప్రతినిధులు ఉంటారు. వీరంతా  ఇవాళ (మే15) సాయంత్రం 6 గంటల నుంచి పోచంపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.  కాగా ఇక్కత్ పట్టుచీరల నేయడంలో పోచంపల్లి ప్రపంచ ఖ్యాతి పొందింది. ఈ సందర్భంగా అందాల భామలు అక్కడి నేతన్నలతో మాట్లాడి, చీరలు నేసే విధానం గురించి పోటీదారులు తెలుసుకోనున్నారు.


 ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు


ఈ సందర్భంగా పోచంపల్లి వీధుల్లో కలియతిరగనున్నారు. అనంతరం అక్కడి మ్యూజియాన్ని సందర్శిస్తారు. అనంతరం స్థానికులతో మాట్లాడి తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. కాగా ఈ సందరీమణులకోసం భూదాన్ పోచంపల్లి ప్రస్థానం, హ్యాండ్లూమ్‌పై ప్రత్యేక వీడియోను ప్రదర్శించనున్నారు. 

ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

సుందరీమణులకు ప్రభుత్వం ఘన స్వాగతం

మరో బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించనుంది. సాయంత్రం 5 గంటలకు ఆలయానికి చేరుకునే ఈ బృందంలో 10 మంది సభ్యులు ఉంటారు. వీరంతా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్వామి వారి ఆలయాన్ని సందర్శించి నరసింహాస్వామిని దర్శించుకుంటారు. ప్రపంచ సుందరీవణులంతా కాగా తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అందాల పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులకు ప్రభుత్వం ఘన స్వాగతం పలుకనుంది.

Also Read: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

తెలంగాణ సంప్రదాయ  కోలాటం, బంజారా నృత్యాలతో ఆలయ అధికారులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రత్యేక అధికారి కిషన్‌రావు నేతృత్వంలో పోటీదారుల బృందానికి ఆహ్వానం పలకనున్నారు. యాదగిరిగుట్ట ఆలయం, విశిష్టత, చారిత్మక నేపథ్యంపై ప్రత్యేక వీడియో ప్రదర్శించనున్నారు. ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం, గ్రూప్ ఫొటో సెషన్‌లో సుందరీమణులు పాల్గొంటారు. అందాల పోటీల కాంటెస్టెంట్లు ఆలయానికి రానుండటంతో బ్రేక్ దర్శనం, జోడు సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.

 

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

ఇది కూడా చూడండి:ఇప్పటివరకూ చూడని విధంగా మోదీ ఉగ్రరూపం.. పాక్‌ను ఏం చేయబోతున్నాడంటే..? 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు