/rtv/media/media_files/2025/05/27/qw6egCOHvTN8pxBjB4pW.jpg)
MLC Kavitha
తనకు సొంత ఎజెండా అంటూ ఏమిలేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం(BRS Merged into BJP) చేయొద్దనేది తన వాదన అని కవిత అన్నారు. మంచిర్యాలలో ఆమె చిట్చాట్ గా మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తను జైల్లో ఉన్న సమయంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను కలుపుతామని చెప్పారని కవిత అన్నారు. కాగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని తను ఒప్పుకోనని కవిత స్పష్టం చేశారు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
Kavitha Chit Chat
తను తన తండ్రి కేసీఆర్ను కలవాలని, ఆయనకు ఈ విషయాలు చెప్పాలని ప్రయత్నం చేశానన్న కవిత.. తండ్రిని కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయానన్నారు. ఇక పార్టీ విషయాలను తన తండ్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ వివరించడంలో తప్పులేదని మరోసారి స్పష్టం చేశారు. అలాంటిది తన లేటర్ బయటకు తెచ్చినవారిని పట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
కాగా కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్కు ఇటీవల రాసిన లేఖ సంచలనంగా మారింది. పార్టీ పరిస్థితితో పాటు పార్టీ విలీనం, కార్యక్రమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఆమె లేఖ రాశారు. అయితే అది బయటకు రావడంతో పార్టీలో దుమారం రేగింది. తన లేఖను బయటకు తెచ్చిందేవరో చెప్పాలంటూ ఆమె పార్టీ నాయకులను డిమాండ్ చేశారు. మరోవైపు పార్టీని బీజేపీలో కలపడానికి ప్రయత్నాలు జరిగాయన్న ఆమె దానికి ఒప్పుకోనని స్పష్టం చేశారు. అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారని కవిత ప్రశ్నించారు. తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు? అని నిలదీశారు. బీఆర్ఎస్లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్.. నాకు ఇంకెవరూ నాయకులు లేరని స్పష్టం చేశారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని తాను అంగీరించనని కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: కమల్ హాసన్కు బిగ్ షాక్.. ‘థగ్ లైఫ్’ మూవీ బ్యాన్..!
Also Read: USA: ట్రంప్ సాధించేశారు..సుంకాల విషయంలో అనుకూలంగా మరో కోర్టులో తీర్పు
manchiryal | kcr | brs mlc kavitha