Pakistan: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

ఇండియాపై అటాక్ చేద్దామని ప్లాన్ చేశామని.. దానికి ఒక్కరోజు ముందే ఇండియా దాడి చేసి పాకిస్తాన్‌ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌పై భారత్ విరుచుకుపడిందని ఆయన ఓటమిని అంగీకరించాడు.

New Update
Shehbaz Sharif

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓటమిని అంగీకరించాడు. అజర్‌బైజాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్‌పై దాడి చేద్దామని ప్లాన్ చేస్తే.. దాని కన్నా ఒకరోజు ముందే పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు చేసిందని అన్నారు. మే 9 -రాత్రి భారతదేశం దాడి చేసినప్పుడు పాకిస్తాన్ సైన్యం అప్రమత్తంగా లేక చిక్కుకుందని ఆయన వివరించారు. బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌తో వల్పిండిలోని విమానాశ్రయంతో సహా కీలక వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు. 

Also Read :  పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

ఒక్కరోజు ముందే పాక్‌పై భారత్ అటాక్

మే 10 తెల్లవారుజామున ప్రార్థనల తర్వాత భారతదేశంపై దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నామని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. పాకిస్తాన్ అటాక్‌కు ముందే ఇండియా లాంగ్ రేంజ్ సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు పాకిస్తాన్‌లోని అనేక ప్రావిన్సులపై నాశనం చేశాయని అన్నారు.

Also Read :  జూన్‌ 10 నాటికి జగన్‌ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read :  తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి

 

india pak war | indian air force strike | pakisthan | india attack on pakistan news | shehbaz-sharif | pm shehbaz sharif | pakistan-pm-shehbaz-sharif | pak-pm-shehbaz-sharif | indo pak war | latest-telugu-news

 

Advertisment
Advertisment
తాజా కథనాలు