తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. సదాశివపేటలో క్షుద్ర పూజలు స్థానిక ప్రజలను భయ బ్రాంతులకు గురి చేశాయి. పట్టణంలోని బస్టాండ్ సమీపం వద్ద ఉన్న ఓ బీరువాల తయారీ ఫ్యాక్టరీలో ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు జరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
నిధుల కోసం ఆరేళ్ల బలికను
దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే గుప్తనిధుల కోసం ఆరేళ్ల బాలికను బలి ఇవ్వబోయారని స్థానికులు ఆందోళనకు దిగారు. కాగా ఈ క్షుద్రపూజలు చేయడానికి ఏకంగా అయోధ్య నుంచి ఓ స్వామీజీని ఇక్కడకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!
బీరువాల ఫ్యాక్టరీలో నిధి ఉందని.. బాలికను బలిస్తే బంగారం దొరుకుతుందని ఓ స్వామీజీ ఒక వ్యక్తిని బాగా నమ్మించాడు. దీంతో ఆ వ్యక్తి భారీగా డబ్బుతో పాటు.. తన ఆరేళ్ల కూతురిని కూడా పూజల కోసం ఆ స్పాట్కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పూజలు చేస్తున్న సమయంలో ఆ ఆరేళ్ల బాలికపై దుప్పటి కప్పి నిద్రపుచ్చారని స్థానికులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
అయితే స్థానికుల అప్రమత్తతో పోలీసులు సమయానికి అక్కడకు చేరుకుని ఆ క్షుద్రపూజలను ఆపడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇంత ఘోరమైన ఘటన జరిగినా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజలు చేసే సమయంలో పళ్లెంలో భారీ మొత్తంలో మాంసం ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. అది మనిషి మాంసమా..? లేక జంతువు మాంసమా? అని తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిందుతులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
crime news | telugu-news | latest-telugu-news | black magic incident | black-magic | telangana-crime | sangareddy | sangareddy crime