/rtv/media/media_files/2025/05/01/42XuDXVNe4YX4frYyHFJ.jpg)
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్. వారిని ఇండియాపైకి ఉసిగొలిసి నిత్యం దాడులు చేయిస్తున్నది. భారత్ మాత్రం ఉగ్రవాదులను టార్గెట్గా మిలిటరీ ఆపరేషన్ చేస్తే.. పాక్ ఆర్మీ రంగంలోకి దిగి దాన్ని పాకిస్తాన్ సార్వభౌమాధికానికి విఘాతం కలిగించేదిగా ఎదురుదాడి చేస్తామని హెచ్చరిస్తోంది. గత కొన్ని ఏళ్లుగా ఇదే తంతు జరుగుతుంది. దీంతో పాకిస్తాన్కు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. అందుకే ఆదేశంతో దౌత్యసంబంధాలు తెంచుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. భారత్ పాకిస్తాన్పై ఎలా దాడి చేస్తోంది. అనేది పెద్ద సందేహం చాలామందిలో ఉంది. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలతో ఎప్పటికైనా భారత్కు ప్రమాదమని తెలిసి ఓ రహస్య ఆయుధాన్ని తయారు చేశారు మనవాళ్లు. ఆ సీక్రిట్ మిషన్ రంగంలోకి దిగితే ఇక రచ్చ రచ్చే. ఆ మిషన్ ఏంటి.. దాని వల్ల పాకిస్తాన్ మెడలు భారత్ ఎలా వంచుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రంగంలోకి ప్రాజెక్ట్ కాళీ
ఇండియన్ ఆర్మీలో చాలా ఆయుధాల పేర్లు మీరు ఇప్పటి వరకు విని ఉంటారు. కానీ ప్రాజెక్ట్ కాళి అని ఎప్పుడూ విని ఉండరు. కొత్త టెక్నాలజీతో తయారు చేసిన ఓ అధునాతన ఆయుధం. ఇది ఇండియాకు శ్రీరామరక్ష లాంటిది. ఇది భవిష్యత్ యుద్ధాల పద్ధతిని మార్చగల ఒక ఆయుధం. 2012 ఏప్రిల్ 7న భారత్ దీన్ని పాకిస్తాన్పై ప్రయోగించిందని ఆరోపించింది. సియాచిన్ హిమానీనదం నుంచి 30 కి.మీ పశ్చిమంలో పాకిస్తాన్ ఆక్రమించిన గయారీ ప్రాంతంలో ఒక సైనిక కేంద్రంపై భారీ హిమపాతం సంభవించింది. 12,385 అడుగుల ఎత్తు నుంచి లోతైన లోయలో ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాల్లో ఒకటి గయారీ బేస్పై హిమపాతం బీభత్సం సృష్టించింది. దాని కారణంగా 129 సైనికులు, 11 పౌరులు మరణించారని పాకిస్తాన్ 2012 మే 29న ప్రకటిచింది. ఈ ప్రకృతి విపత్తు వెనుక భారత్ కుట్ర ఉందని ప్రచారంలో జరిగింది. భారతదేశం కాళీ ప్రాజెక్ట్ వల్లనే హిమానీనదం కరిగిపోయిందని. రహస్య ఆయుధం కాళీని టెస్టింగ్ కోసం భారత్ ఉపయోగించిందని పాక్ ఆరోపించింది.
India‘s secret weapon project KALI pic.twitter.com/dqduBuyiTk
— Mr. Mohan (@kundenapally_12) May 1, 2025
KALI- దీని పూర్తి పేరు Kilo Ampere Linear Injector. ఇది శక్తివంతమైన ఎలక్ట్రాన్ బీమ్ను విడుదల చేస్తుంది. ఈ బీమ్ శత్రువుల ఎలక్ట్రానిక్ సిస్టమ్లను నాశనం చేయగలదు. ఇది DRDO, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) కలిసి అభివృద్ధి చేశాయి. కాళీ సిరీస్ నిరంతరం అప్డేట్ అవుతుంది. pic.twitter.com/JV8RmAxibW
— Mr. Mohan (@kundenapally_12) May 1, 2025
ఏరోస్పేస్, సెక్యురిటీ అనాలసిస్, ADE ఇంజినీరింగ్ కంపోనెంట్స్ డైరెక్టర్ గిరీష్ లింగన్న ఇండియా దగ్గరున్న భయంకరమైన సీక్రెట్ వెపన్ గురించి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి కారణంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ రహస్య ఆయుధం కాళీని చూసి పాకిస్తాన్ను భయపడుతుంది. ఈ కాళీ ప్రాజెక్ట్ను పర్వతాల మంచును కరిగించడానికి ఉపయోగిస్తున్నారని నమ్మకం. ఈ ప్రాజెక్ట్ని ఆపరేషన్ వైట్వాష్ అనే కోడ్ నేమ్తో నడుపుతున్నారు. కొంతమంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్ల చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది హిమపాతాన్ని ప్రేరేపిస్తుందట. సరైన సమాచారం మాత్రం ఇప్పటికీ కచ్చితంగా లేదు. ఇది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. జాతీయ భదత్ర దృష్యా ఈ ప్రాజెక్ట్ కాళీ గురించి భారత ప్రభుత్వం బయటకు చెప్పలేదు. ఇంత కంటే ఎక్కువ సైన సమాచారం ప్రాజెక్ట్ కాళీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ సమాచారం సున్నితమైనది, దీనిని బహిర్గతం చేయడం జాతీయ భద్రతకు హాని కలిగిస్తుందని రక్షణ శాఖ తెలిపింది.
కాళీ పని
— Mr. Mohan (@kundenapally_12) May 1, 2025
ఈ ప్రాజెక్ట్ పని 1989లో ప్రారంభమైంది. BARC యాక్సిలరేటర్, పల్స్ పవర్ డివిజన్ దీనిని అభివృద్ధి చేస్తోంది. DRDO కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి. మొదటగా ఇది పరిశ్రమల కోసం రూపొందించబడింది. కానీ ఇప్పుడు ఇది ఆయుధంగా ఉపయోగించబడుతుంది. pic.twitter.com/7WtJYUcFU9
కాళీ అంటే..?
ADE ఇంజినీరింగ్ కంపోనెంట్స్ డైరెక్టర్ గిరీష్ లింగన్న ప్రకారం.. కాళీ భారతదేశం రహస్య ఆయుధం. దీని పూర్తి పేరు కిలో ఆంపియర్ లీనియర్ ఇంజెక్టర్ (Kilo Ampere Linear Injector). ఇది శక్తివంతమైన ఎలక్ట్రాన్ బీమ్ను విడుదల చేస్తుంది. ఈ బీమ్ శత్రువుల ఎలక్ట్రానిక్ సిస్టమ్లను నాశనం చేయగలదు. ఇది DRDO, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) కలిసి అభివృద్ధి చేశాయి. కాళీ సిరీస్ నిరంతరం అప్డేట్ అవుతుంది.
పాకిస్తాన్ మెడలు భారత్ ఎలా వంచుతుందంటే..! pic.twitter.com/GKmVgqWDpB
— Mr. Mohan (@kundenapally_12) May 1, 2025
హాలీవుడ్ సినిమాల్లో స్టార్ వార్స్లా
కాళీ మిసైల్స్ నుంచి దేశాన్ని రక్షించగలదు. పాకిస్తాన్, చైనా ఈ ఆయుధం గురించి తెలుసుకున్నాయని భావిస్తున్నారు. వారు ఈ విషయంలో బహిరంగంగా మాట్లాడరు. కానీ భయపడుతున్నారు. కాళీ ఒక లీనియర్ ఎలక్ట్రాన్ యాక్సిలరేటర్, దీన్ని పార్టికల్ యాక్సిలరేటర్ అని కూడా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఇది రిలేటివిస్టిక్ ఎలక్ట్రాన్ బీమ్స్ను విడుదల చేస్తుంది. ఈ పల్ల్స్ X-కిరణాలు లేదా మైక్రోవేవ్స్గా మారతాయి. కాళీ ప్రయోగిస్తే హాలీవుడ్ సినిమాల్లో స్టార్ వార్స్లా కనిపిస్తోంది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
కాళీ ఎలా పనిచేస్తుంది?
ఈ ప్రాజెక్ట్ పని 1989లో ప్రారంభమైంది. BARC యాక్సిలరేటర్, పల్స్ పవర్ డివిజన్ దీనిని అభివృద్ధి చేస్తోంది. DRDO కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి. మొదటగా ఇది పరిశ్రమల కోసం రూపొందించబడింది. కానీ ఇప్పుడు ఇది ఆయుధంగా ఉపయోగించబడుతుంది. కాళీ REBs లేజర్ బీమ్ కంటే భిన్నమైనవి. లేజర్ బీమ్ లక్ష్యాన్ని ఛేదించి నాశనం చేస్తుంది. కాళీలో REBs మైక్రోవేవ్స్ ఉంటాయి. ఇవి టార్గెట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్లను కరిగించి నాశనం చేస్తాయి.
కాళీ టెక్నికల్ డిటేల్స్
Also Read: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి
కాళీ-5000: ఇది 1 MeV ఎలక్ట్రాన్ శక్తితో పల్స్ యాక్సిలరేటర్. దీని పల్స్ టైమ్ 50-100 నానోసెకన్లు. ఇది 40 కిలో ఆంపియర్ కరెంట్, 40 గిగావాట్ పవర్ కలిగి ఉంటుంది. దీని బరువు10 టన్నులు.
కాళీ-10000: దీని బరువు 26 టన్నులు. 12,000 లీటర్ల నూనెతో కూల్ చేస్తారు. 100 మిల్లీసెకన్లలో 40 గీగావాట్ పవర్ను ఉత్పత్తి చేయగలదు.
కాళీ ఒక లీనియర్ ఎలక్ట్రాన్ యాక్సిలరేటర్, దీన్ని పార్టికల్ యాక్సిలరేటర్ అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఇది రిలేటివిస్టిక్ ఎలక్ట్రాన్ బీమ్స్ను విడుదల చేస్తుంది. కాళీ ప్రయోగిస్తే హాలీవుడ్ సినిమాల్లో స్టార్ వార్స్లా కనిపిస్తోంది. pic.twitter.com/rxXilXR0Uc
— Mr. Mohan (@kundenapally_12) May 1, 2025
యుద్ధంలో కాళీ పని
కాళీ ట్యాంకులు, యుద్ధ విమానాలు, మిసైల్స్, నౌకలను క్షణాల్లో నాశనం చేయగలదు. నౌకాదళ యుద్ధాల్లో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శత్రువుల ఎలక్ట్రానిక్ సిస్టమ్లను పూర్తిగా నాశనం చేస్తుంది. ఇది భారతదేశానికి లేజర్ డిఫెన్స్ షీల్డ్గా పనిచేస్తుంది.
(project kali | india pak war | pakistan | Indian Army | jammu-kashmir | Pahalgam attack | latest-telugu-news)