స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక AXIOM-4 ప్రయెగం మళ్లీ వాయిదా పడింది. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా వాయిదా వేసినట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. మరమ్మతులకు సమయం పడుతుందని.. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటూ మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు ప్రయాణించాల్సి ఉంది. ఇండియా తరఫున గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మిషన్లో భాగమయ్యారు. AXIOM-4లో మిషన్ పైలట్గా కెప్టెన్ శుభాంశు శుక్లా వ్యవహరించనున్నారు. 41 ఏళ్ల తర్వాత భారత ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి వెళుతున్నారు. దీని కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన క్షేమంగా వెళ్ళి రావాలని కోరుతున్నారు. 1984లో చివరిసారిగా ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు.
Standing down from tomorrow’s Falcon 9 launch of Ax-4 to the @Space_Station to allow additional time for SpaceX teams to repair the LOx leak identified during post static fire booster inspections. Once complete – and pending Range availability – we will share a new launch date pic.twitter.com/FwRc8k2Bc0
— SpaceX (@SpaceX) June 11, 2025
అత్యంత చిన్న వయసులో..
అంతరిక్షంలోకి ఇప్పటివరకు భారతీయడు రాకేశ్ శర్మ ఒక్కరే వెళ్ళారు. కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్ వెళ్ళినా వాళ్ళు ఇండియన్ ఆరిజీన్ అమెరికన్లుగా3 గుర్తింపు పొందినవారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక భారతీయుడు స్పేస్లోకి వెళ్ళబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళుతున్న శుభాంశు శుక్లా అత్యంత పిన్న వయస్కుడు. అక్టోబర్ 10, 1985న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో శుక్లా జన్మించాడు.నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్న ఇతను జూన్ 17, 2006లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరారు. తర్వాత ఫైటర్ కంబాట్ లీడర్గా అపాయింట్ అయ్యారు.ఇతనికి మొత్తం 2000 ఫ్లైట్ అవర్స్ అనుభవం ఉంది. సుఖోయ్-30MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్ మరియు An-32 వంటి విమానాలను నడిపిన అనుభవం కూడా ఉంది.
Also Read: USA: మండుతున్న అమెరికా..ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన లాస్ ఏంజెలెస్ నిరసనల సెగ