/rtv/media/media_files/2025/06/19/revanth-reddy-warns-ap-cm-2025-06-19-08-46-36.jpeg)
ఆంద్రప్రదేశ్, తెలంగాణ జలవివాదంలో సీఎం రేవంత్ రెడ్డి ఏసీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ అంశం ముదురుతోంది. బనకచర్ల ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేంద్రంలో పలుకుబడి ఉందని రెచ్చిపోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు. మీరు చెబితే మోదీ వింటాడు కావొచ్చు.. కానీ తెలంగాణ ప్రయోజనాలను మేము వదులుకోమని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు అన్నీ అనుమతులు వస్తాయనుకుంటే అది మీ భ్రమ అని ఆయన హెచ్చరించారు.
Also Read : 'కుబేరా' నుంచి ధనుష్ ఎమోషనల్ ట్యూన్.. వింటే కన్నీళ్లు ఆగవు!
Also Read : అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్న్యూస్.. మళ్లీ వీసాలు షురూ
Revanth Reddy Warns AP CM Over Banakacharla Project
తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెల్చి చెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు మేము ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ నీళ్ల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటానికి సిద్ధమైంది. గురువారం సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరనున్నారు. మధ్యాహ్నాం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అవనున్నారు. పోలవరం, బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ తరపున ఫిర్యాదు చేయనున్నారు.
Also Read : బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
Also Read : ఇరాన్కు అండగా ఏకమైన 21 ఇస్లామిక్ దేశాలు
Andhra Pradesh | cm-revanth-reddy | Telangana CM | latest-telugu-news | godavari-water | Banakacharla