ఇరాన్పై ఇజ్రాయెల్ భీకరంగా క్షిపణులను ప్రయోగిస్తొంది. ఇరాన్లో 1100 టార్గెట్లను ధ్వంసం చేసింది. ఈ రెండు దేశాల యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. దీంతో ఇరాన్కు అండగా 21 ఇస్లామిక్ దేశాలు ఏకమైయ్యాయి. ఇరాన్పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కూటమిలో పశ్చిమాసియా, ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశాలు ముందుకు వచ్చాయి. ఇందులో ఈజిప్ట్, పాకిస్తాన్, సౌదీ, కువైట్, UAE సహా పలు దేశాలు ఉన్నాయి.
తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ ఆయా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ను అణ్వాయుధ రహిత ప్రాంతంగా మారాలని కోరారు. న్యూక్లియర్ ఆయుధాలపై స్పష్టత ఇవ్వాలని, NPT ఒప్పందంలో చేరాలని ఇజ్రాయెల్కు ఇస్లామిక్ దేశాలు పిలుపునిచ్చాయి. శాంతి పరిరక్షణే ప్రధాన లక్ష్యమని 21 దేశాది నేతలు కదిలారు.
ఇజ్రాయిల్ దాడిలో 600 మంది ఇరానియన్స్ మృతి
టెహ్రాన్ సహా పలు ప్రాంతాలను తమ మిసైల్స్ ధ్వంసం చేశాయని బుధవారం ఇజ్రాయిల్ ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నాశనం చేశామని తెలిపింది. పశ్చిమ ఇరాన్, టెహ్రాన్ గగనతలంపై పూర్తిగా పట్టు సాధించామని, 70 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలు ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో దాదాపు 600 మంది ఇరానీలు మృతి చెందారు. వందల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. వాహనాలు ధ్వంసమైయ్యాయి.