/rtv/media/media_files/2025/06/19/telangana-govt-brakes-to-engineering-colleges-fee-hike-2025-06-19-08-51-00.jpg)
Telangana govt brakes to Engineering Colleges Fee hike
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు గురించి చర్చలు జరిపారు. రానున్న 2025-27 మూడేళ్ల బ్లాక్ పీరియెడ్కు ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Also Read: ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు.. 4 భారతీయ బడులకు చోటు
Also Read : భారీ వరదలు.. 48గంటల్లోనే 22 మంది మృతి
TG Engineering Colleges Fee Hike
కానీ TAFRC అధికారులు సరిగ్గా ఫీజుల ప్రతిపాదన చేయలేదు. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపును ఆపేయాని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని కాలేజీల్లో కూడా ఫీజుల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై సమీక్షించేందుకు ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాతే ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఫీజుల పెంపు సరిగా చేయలేదని ఆయన అధికారులపై ధ్వజమెత్తారు.
Also read: ఇరాన్పై ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్.. ఇజ్రాయిల్ అండగా రంగంలోకి అమెరికా!
Also Read : ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు.. 4 భారతీయ బడులకు చోటు
engineering-college | latest telangana news | telangana government news | Revanth Reddy | latest-telugu-news | telugu-news | today-news-in-telugu