Engineering: బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

New Update
Telangana govt brakes to Engineering Colleges Fee hike

Telangana govt brakes to Engineering Colleges Fee hike

తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం తెలంగాణ అడ్మిషన్ అండ్  ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు గురించి చర్చలు జరిపారు. రానున్న 2025-27 మూడేళ్ల బ్లాక్ పీరియెడ్‌కు ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.    

Also Read: ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు.. 4 భారతీయ బడులకు చోటు

Also Read :  భారీ వరదలు.. 48గంటల్లోనే 22 మంది మృతి

TG Engineering Colleges Fee Hike

కానీ TAFRC అధికారులు సరిగ్గా ఫీజుల ప్రతిపాదన చేయలేదు. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపును ఆపేయాని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని కాలేజీల్లో కూడా ఫీజుల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై సమీక్షించేందుకు ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాతే ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఫీజుల పెంపు సరిగా చేయలేదని ఆయన అధికారులపై ధ్వజమెత్తారు. 

Also read: ఇరాన్‌పై ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్.. ఇజ్రాయిల్ అండగా రంగంలోకి అమెరికా!

Also Read :  ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు.. 4 భారతీయ బడులకు చోటు

 

engineering-college | latest telangana news | telangana government news | Revanth Reddy | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు