/rtv/media/media_files/2025/05/30/2Ev9nyGRTgBmDrJWp87y.jpg)
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీలో కొంతమందిపై కోపంగా ఉన్న ఆమె నెక్ట్స్ ఏం చేస్తారో అని యావత్ రాష్ట్రం వేచి చూస్తోంది. తండ్రి, బీఆర్ఎస్ అధినేతకు ఆమె రాసిన లేఖ బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని కల్వకుంట్ల కవిత అన్నారు. ఇదిలా ఉండగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఆమెకు స్వయాన అన్న. ఇటీవల ఓ చిట్చాట్లో ఆయన్ని ఉద్దేశించి ముఖ్య నాయకుడిగా చేయాల్సిన పనులు చేయాలని, ట్విటర్లో పోస్టులు పెడితే సరిపోదని అన్నారు. కవిత జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ ఆమెను కలవలేదు. కవితకు పార్టీలో పెద్ద ప్రాదాన్యత కూడా ఇవ్వట్లేదు. పార్టీకి, తండ్రికి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆమె అసంతృప్తిని వెల్లబోసింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కూడా ఇలానే అన్న జగన్పై అనేక ఆరోపణలు చేసింది. ఇద్దరి మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
Also Read : పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?
Also Read : ముక్కు పూడకతో కొత్త అవతారమెత్తిన అనసూయ! చీరలో భలే ఉంది
మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.!
— Telugu Reporter (@TeluguReporter_) May 29, 2025
తన లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలని డిమాండ్..👇🏻
స్వంత బిడ్డపై మీ ప్రతాపం ఏంటి? బయట వాళ్లపై ఎందుకు మాట్లాడటం లేదు?
ఇదేనా పార్టి ని నడిపించడం ? సభను సక్సెస్ చేసింది కెసిఆర్ మాత్రమే ప్రతిదీ ఆయనే చూసుకున్నారు.
గంపగుత్తగా… pic.twitter.com/Ak7NfIGi4b
Also Read : ఏపీలో రెండేళ్ల హత్య కేసును ఛేదించిన పోలీసులు
పోలికలివే..!
కవిత, షర్మిల ఇద్దరి భర్తల పేర్లు కూడా అనిలే.. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు కూడా మొదట్లో అన్నతోనే నడిచారు. అన్న నాయకత్వంలోనే పని చేశారు. సొంత గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నారు.
వైఎస్ షర్మిల తండ్రి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు. కవిత ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణ జాగృతి అనే ఓ సంస్థను ఏర్పాటు చేసి తనకంటూ ఓ సొంత బలాన్ని నిర్మించుకున్నారు. నిజామాబాద్ ఎంపీ, ఎమ్మెల్సీగా కవిత పని చేశారు. షర్మిల మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, కానీ కవిత మీద ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఆమెని ఈడీ అరెస్ట్ చేసి దాదాపు 5 నెలలు జైళ్లో కూడా ఉన్నారు.
షర్మిల కంటే కవితకు కొంచెం మాటకారి. రాజకీయ ఉపన్యాసాల్లో ఆమె తండ్రి కేసీఆర్కు ఏ మాత్రం తీసిపోదు. సూటిగా ప్రశ్నించే తత్వం ఇద్దరిలోనూ ఉంది. అటు కవిత, ఇటు షర్మిల ఇద్దరూ అన్నపైనే దండయాత్ర చేస్తున్నారని సోషల్ మీడియాలో, బీజేపీ నాయకులు అంటున్నారు. కవిత ఇప్పటి వరకు సొంత పార్టీ పెడతా అని ప్రకటించలేదు. కానీ.. షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. దాంతో ఆమె ప్రజల్లోకి అంతగా వెళ్లలేక పోయారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా బీజేపీకి ఊడిగం చేశారు!
— Telugu360 (@Telugu360) May 6, 2025
- జగన్ పై వైఎస్ షర్మిల ఫైర్ pic.twitter.com/lWs4GxkRKf
Also Read : గృహప్రవేశం రోజే బిల్డింగ్ నేలమట్టం.. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం!
అప్పుడు అన్నయ్య.. ఇప్పుడు ఆరోపణలు
2019లో షర్మిల అన్న జగన్ వైఎస్ ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రాడానికి వైఎస్ షర్మిలా కూడా ప్రచారం చేశారు. అన్న వెంటే ఉండి పార్టీ బాధ్యతలు పంచుకున్నారు. పాదయాత్ర కూడా చేశారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు కాస్త వివాదాలకు దారితీశాయి. అప్పటి నుంచి షర్మిల అన్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించింది. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు ఆమె. ఇటు కవిత విషయానికి వస్తే ఆమె కూడా అన్న కేటీఆర్ పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. 2014 నుంచి, అంతకు ముందు కూడా పార్టీ కార్యక్రమాల్లో ఆమె చాలా యాక్టీవ్గా ఉంది. ప్రస్తుతం ఆమె అసంతృప్తి కారణంగా పరోక్షంగా కేటీఆర్పై విమర్శలు చేస్తున్నారు. ఇది ఇంతటితో ఆగిపోతుందా... లేదా వైఎస్ షర్మిల లాగే సొంత పార్టీ, అన్నపై ఆరోపణల వరకూ వెళ్తోందా చూడాలి మరి.
mlc-kalvakuntla-kavitha | kalvakuntla-kavitha | kavitha latter to KCR | ys-sharmila | Jagan and YS Sharmila | Jagan and YS Sharmila issue | ktr | telangana | andhrapradesh | latest-telugu-news