Rajnath Singh: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

1947 నుంచి పాక్ ఆడుతున్న గేమ్ ముగిసిందని, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. యుద్ధనౌక INS విక్రాంత్‌ ఆయన శుక్రవారం సంద‌ర్శించారు. ఉగ్రవాదుల్ని నాశనం చేయడానికి పాక్‌ను ఎలాగైనా దెబ్బకొడతామన్నారు.

New Update
Defence Minister Rajnath

యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సంద‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాక్‌‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్‌ చర్చలకు సిద్ధంగా ఉంటే ముందు ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలన్నారు. కరడుగట్టిన టెర్రరిస్ట్‌లు మసూద్‌ అజార్‌, హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ పాక్ ఆడుతున్న ప్రమాద‌క‌ర ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసింద‌ని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

Also Read: 2014- 2023 గద్దర్ అవార్డ్స్.. ఉత్తమ చిత్రాలుగా RRR, అఖండ, జెర్సీ, కలర్ ఫొటో

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

Rajnath Singh Demands On Terrorists

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

ఆప‌రేష‌న్ సిందూర్ అనేది కేవ‌లం సైనిక చ‌ర్య మాత్రమే కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అది ఉగ్రవాదంపై మూకుమ్మడి దాడి అని హెచ్చరించారు. పాక్‌లో టెర్రరిస్టులను నాశ‌నం చేసేందుకు ఏ ప‌ద్ధతినైనా అనుస‌రిస్తామ‌న్నారు. పాక్ ఊహించ‌లేని విధంగా ఆ చ‌ర్యలు ఉంటాయ‌ని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌ను ఐఏఎఫ్ ధ్వంసం చేస్తే, అరేబియా స‌ముద్రంలో ఉన్న భార‌త యుద్ధ నౌక‌లు.. పాకిస్థానీ నేవీని తీరానికి ప‌రిమితం చేశాయ‌న్నారు.

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

pakistan | defence-minister-rajnath-singh | Pakistan terrorists | pakistan terrorist attack | india | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు