BIG BREAKING: 'ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ'!

కేసీఆర్ ఫ్యామిలీపై కాంగ్రెస్‌ నేత సామ రామ్మోహన్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత ఏకాకి అయ్యారని అన్నారు. ఆ అసంతృప్తిని కేసీఆర్‌కు రాసిన లేఖలో వివరించారని, త్వరలోనే కవిత కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ వ్యాఖ్యానించారు.

New Update
kaivtha sam

Sama Rammohan sensational comments BRS and KCR family

బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీపై కాంగ్రెస్‌ నేత సామ రామ్మోహన్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవిత కొత్తపార్టీ పెట్టబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌లో కవిత ఒంటరి అయ్యారని, తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడిన సామ.. కవితకు కల్వకంట్ల ఇంటితోనే పోరు మొదలైందని, కవిత కొత్త పార్టీని కాంగ్రెస్‌ స్వాగతిస్తుందన్నారు.  

Also Read :  రెండు నెలల తర్వాత ఫస్ట్ నైట్.. ఆ రాత్రి భార్య చేసిన పనికి భర్త గుండె గుబేల్!

Also Read :  అతడితో సమంత ఫొటో.. మూవీపై మదర్ వీడియో వైరల్..!

బీజేపీతో దోస్తీ నచ్చట్లేదు..  

కవిత బీఆర్ఎస్‌లో ఏకాకి అయ్యారని, అందుకే తన అసంతృప్తి మొత్తాన్ని కేసీఆర్‌కు రాసిన లేఖలో వివరించారని ఆరోపించారు. అయితే కవిత అమెరికాకు వెళ్లడానికి ముందే ఆ లేఖ బహిర్గతమైందని చెప్పారు. 'కవిత కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్‌ స్వాగతిస్తుంది. కానీ కేసీఆర్‌ లాగా నిరంకుశంగా వ్యవహరిస్తే ఊరుకోం. కవితను లోపలేసిన బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కవితకు మింగుడుపడట్లేదు. బీజేపీపై కొట్లాడే స్వేచ్ఛ కవితకు బీఆర్‌ఎస్‌లో లేదు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము బీఆర్ఎస్‌కు ఉందా? కవితకు వచ్చిన దుస్థితే బీఆర్ఎస్‌లో అందరికీ వస్తుంది' అంటూ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. 

పదేళ్ల పాలనపై అసంతృప్తి..

అలాగే గత కొన్నిరోజులుగా కవిత తన తండ్రి కేసీఆర్ పదేళ్ల పాలన విధానాలపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారన్నారు. సామాజిక తెలంగాణ సాధనలో, మహిళా సమానతలో బీఆర్ఎస్ విఫలమైందని కవిత ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి వచ్చినపుడు ఎవరినీ వదిలేది లేదని ప్రతిజ్ఞ చేసిన కవిత.. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయకుండా సొంత కుటుంబమే అడ్డుకుంటుందన్నారు. దీంతో కవిత తట్టుకోలేకపోతున్నారని, రాజకీయంగానూ బీఆర్ఎస్ లొ కవితను అణిచివేస్తున్నట్లు చెప్పారు. 

Also Read :  ప్రెగ్నెన్సీ తర్వాత పాన్ ఇండియా హీరోతో దీపికా రీఎంట్రీ.. ఊహించని రేంజ్ లో రెమ్యునరేషన్!

కల్వకుంట్ల కుటుంబంలో పురుషాధిక్యత

బీఆర్ఎస్ పార్టీ వేలకోట్ల ఆస్తులను కేటీఆర్ చేతికి, ఆయన పిల్లలకే అప్పగిస్తున్నారు. కానీ కవితకు, ఆమె పిల్లలకు అందకుండా పోయే పరిస్థితి ఉందని, దీంతో కవిత ఆందోళన చెందుతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, ఆ వాస్తవాన్ని కవిత గ్రహించారని సామా ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేటీఆర్ తన తదుపరి రాజకీయ వారసుడన్నట్లుగా వేదికపై ఆయన ఫోటో మాత్రమే పెట్టడం ఇందుకు నిదర్శనం అన్నారు. 

ఆధిపత్య పోరు..

మహిళలు రాజకీయంగా రాణించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అలాగే కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత రాజకీయ ఆధిపత్య పోరును కవిత బయటపెట్టాలని సామా కోరారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీనం ఆరోపణలు.. బీజేపీ, బీఆర్ఎస్ లకే వర్తిస్తాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, బీఆర్ఎస్ కుంభకోణాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుల్లో బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు ఈడీని ఎంటర్ చేస్తూ, బీజేపీ విచారణకు ఆటంకాలు కలిగిస్తోందని ఆరోపించారు. 

Also Read :  అందమే ఆమెకు శాపంగా మారింది.. ఎల్బీనగర్‌లో జాస్మిన్ హత్య వెనుక హృదయవిదారక కథ

kavitha | kcr | brs | congress | telugu-news | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు