/rtv/media/media_files/2025/05/14/OGJfz7G48MXHTGi7l1Rt.jpg)
Uttar Pradesh Hardoi bride flees with cash and gold from grooms house
ప్రస్తుత కాలంలో కిలాడీ పెళ్లి కూతుర్ల ఆగడాలు ఎక్కువైపోయాయి. డబ్బుకోసం ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని.. వారి నుంచి డబ్బులు దోచేస్తున్నారు. ఇష్టంతో పెళ్లి చేసుకున్నట్లు నటించి.. వరుడి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారంతో ఉడాయిస్తున్నారు. ఇప్పటికి చాలానే ఇలాంటి సంఘటనలు జరిగాయి. తాజాగా మరొకటి చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన రెండు నెలలకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఆ రాత్రి భర్త కళ్లుగప్పి భార్య ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో పరారైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్బాల్ ఎంట్రీ అదిరిపోయింది
డబ్బులు, బంగారంతో పరార్
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఉంచటిల ప్రాంతానికి చెందిన రామ్ ప్రతాప్ యాదవ్కు మహారాజ్గంజ్లోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. వీరి పెళ్లికి దినేష్, శ్యాము, కుల్దీప్లు మధ్యవర్తిత్వం వహించారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ వధువు వాళ్ల తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉంటుంది. కనీసం ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. ఇక ఈ నెల 10 (మే10)న రామ్ ప్రతాప్ తన భార్యను తిరిగి తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు.
Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
అదే రోజు రాత్రి ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఫుల్గా రెచ్చిబోదామని అనుకున్నాడు. కానీ ఫుల్గా మత్తులోకి జారుకుని నిద్రమైకంలోకి వెళ్లిపోయాడు. తీరా తెల్లారి చూసే సరికి తన భార్య ఇంట్లో కనిపించలేదు. చుట్టూ వెతికాడు కానీ ప్రయోజనం లేకపోయింది. ఎంత వెతికినా ఎక్కడా ఆమె ఆచూకీ కనిపించలేదు. వెంటనే వెళ్లి డబ్బు, బంగారం చూశాడు. అవి కూడా కనిపించకుండా పోయాయి. దాదాపు రూ.13వేలతో పాటు బంగారం కూడా కనిపించకపోవడంతో తన పెళ్లికి మధ్యవర్తిత్వం వర్తించిన దినేష్, శ్యాము, కుల్దీప్లకు జరిగిన విషయం చెప్పాడు.
Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!
అయితే వారు సరిగ్గా స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. అందులో తనకు రెండు నెలల క్రితం పెళ్లి అయిందని.. మే 10న ఇంటికి తీసుకొచ్చానని తెలిపాడు. అదే రోజు రాత్రి భోజనం చేశానని.. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలీదని.. ఫుల్గా నిద్రమైకంలోకి వెళ్లిపోయానని ఫిర్యాదులో రాసుకొచ్చాడు. ఆ తర్వాత తాను నిద్ర లేచే సరికి తన భార్య, ఇంట్లో దాచిపెట్టిన బంగారం, రూ.13వేల నగదు కూడా కనిపించకుండా పోయాయని తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
latest-telugu-news | telugu-news | crime news | bride