/rtv/media/media_files/2025/06/29/suspended-from-congress-party-2025-06-29-20-21-38.jpg)
Suspended from Congress party
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా ఇటీవల ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతను సస్పెండ్ చేసింది.ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి శ్రీనివాస్ మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు పలువురు ఫిర్యాదు చేశారు. సీతక్కతో పాటు ఆసిఫాబాద్ డీసీసీ విశ్వప్రసాద్ సైతం శ్రీనివాస్ పోస్టులపై ఫిర్యాదు చేశారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
సీతక్క, విశ్వప్రసాద్ ఫిర్యాదు మేరకు రావి శ్రీనివాస్ను పార్టీ నుండి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది.
రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తా : రావి శ్రీనివాస్
కాగా తన సస్పెన్షన్ పై రావి శ్రీనివాస్ గట్టిగానే స్పందించారు. తనను సస్పెండ్ చేస్తారని ముందుగానే ఊహించానని తెలిపారు. సీతక్క ఇచ్చిన ఫిర్యాదుతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. అంతేకాక అధిష్టానానికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో దీనికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని, అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
Also Read: కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
komaram-bheem-asifabad | asifabad-district | mallu-ravi | MP mallu ravi | tpcc | ts-congress-politics | ts-congress | suspend