/rtv/media/media_files/2025/06/29/medak-couple-suicide-attempt-jumped-from-court-building-2025-06-29-12-22-38.jpg)
Medak couple suicide attempt jumped from court building
తెలంగాణలోని మెదక్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ జంట తమ ఇద్దరు పిల్లలను కోర్టు బిల్డింగ్ పై నుంచి కిందికి తోసి.. ఆపై వారు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే మృతి చెందింది. ఇద్దరు పిల్లలు, భర్త తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు
కోర్టు భవనంపై నుంచి దూకి
మెదక్ అర్బన్లోని రామాయంపేట మండలం లక్ష్మాపూర్కు చెందిన నడిమింటి రమ్య (24)కు, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్కు చెందిన నవీన్గౌడ్కు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరి రుత్విక, శశ్విక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నవీన్ ఆటో డ్రైవర్గా పని చేస్తూ తన ఫ్యామిలీని పోషిస్తున్నాడు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
అయితే కొన్నేళ్ల నుంచి నవీన్, రమ్య మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆరు నెలల క్రితం రమ్య తన పుట్టింటికి వచ్చేసింది. ఆ సమయంలో రమ్య బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అతడ్ని అరెస్టు చేశారు. ఈ కేసులో నవీన్ 3 నెలలు జైల్లో ఉన్నాడు. అనంతరం అతడు బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత ఊరి పెద్దలు పంచాయితీ పెట్టి నవీన్, రమ్య దంపతులను మళ్లీ కలిపారు.
Also Read: కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
అయితే ఈ కేసు విచారణ సమయంలో పోలీసులు నవీన్ బైక్, ఫోన్ను సీజ్ చేయగా.. వాటిని తెచ్చుకోవడానికి అతడు భార్య, పిల్లలతో కలిసి శనివారం సాయంత్రం మెదక్ కోర్టుకు వెళ్లాడు. అక్కడ దంపతుల మధ్య మరోసారి గొడవ జరగగా.. వారు కోర్టు భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త, ఇద్దరు పిల్లలు గాయాలపాలయ్యారు. వారిని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు.
Also Read : జపాన్లో ‘ట్విటర్ కిల్లర్’ కు ఉరి