/rtv/media/media_files/2025/06/27/student-gang-raped-in-kolkata-law-college-2025-06-27-18-12-54.jpg)
Student gang-raped in Kolkata law college
ఇటీవల కోల్కతాలోని లా కాలేజ్లో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఓ టీఎంసీ నేతతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసి గురువారం కోర్టులో హజరుపర్చారు. దీంతో న్యాయస్థానం నిందుతులకి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. అయితే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి.
Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు
కాలేజీ యూనియన్ రూమ్లో ఉండగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే గత కొన్నిరోజులుగా మనోజిత్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. దీనికి యువతి ఒప్పకుకోపోవడంతోనే మనోజిత్ స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. లా సెక్యూరిటీ రూం బంధించి రాత్రి వరకు అత్యాచారం చేశారు. పారిపోయేందుకు యత్నించిన బాధితురాలిపై హాకీ స్టిక్తో దాడి చేశారు. అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియోను కూడా నిందితులు తీశారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. ఆమె తనను ఆస్పత్రికి తీసుకెళ్లండి ప్లీజ్ అని వేడుకున్నా కూడా ఆ దుర్మార్గులు కనికరించలేదు. ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. మరోవైపు ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ కూడా సుమోటాగా స్వీకరించింది. ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. నిందితులను ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిందితులు మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమీద్ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఇందులో ప్రధాన నిందితుడు అధికార టీఎంసీ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు కావడం గమనార్హం.
Also Read: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖమేనీని హత్య చేయాలనుకున్నాం, కానీ..