/rtv/media/media_files/2025/06/28/psycho-nri-husband-in-bhadradri-kothagudem-2025-06-28-08-45-00.jpg)
Psycho NRI husband in Bhadradri Kothagudem
TG Crime: పెళ్లిచేసుకుని ఏడాదిన్నర కాపురం చేసిన ఎన్ఆర్ఐ నవీన్రెడ్డి ముఖం చాటేశాడు. భార్యను వేధింపులకు గురిచేయడంతో పాటు, ఫ్రెండ్లీగా విడిపోదాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడు. భార్య వీసా క్యాన్సిల్ చేయించి ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు. కాగా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇల్లందు సీఐని అధికారులు సస్పెండ్ చేశారు.
ఇది కూడా చూడండి: Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి ప్రాంతంలోని చెంగిచర్లకు చెందిన దుబ్బాక వేణుగోపాల్రెడ్డి కుమార్తె శ్రావ్యను.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లలితాపురానికి చెందిన ఎన్నారై పెండ్లి నవీన్రెడ్డికి ఇచ్చి, 2023 జూన్ 8న పెండ్లి చేశారు. -- పెండ్లి సమయంలో 55 తులాల బంగారం, 10 లక్షల కట్నం ఇచ్చారు. నవీన్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. పెండ్లీ తర్వాత భర్తతో కలిసి శ్రావ్య డాలస్ వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత నవీన్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది. బట్టతల ఉన్న నవీన్ రెడ్డి విగ్గుతో మ్యానేజ్ చేసినట్టు తేలింది. అంతేకాక శ్రావ్యను వేధింపులకు గురిచేసినట్టు తెలిసింది.
ఇది కూడా చూడండి: Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్ సినిమాకే హైలైట్.. మంచు విష్ణు నటనకు కన్నీళ్లు ఆగవు!
ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ 24న ఆమెను -- వీసా స్టాంపింగ్ ఉందని చెప్పి ఇండియాకు పంపించి వేశాడు. ఆ తర్వాత ఆమె వీసాను క్యాన్సిల్ చేయించాడు. అయితే తనను భర్త నవీన్రెడ్డి ఉద్దేశపూర్వకంగా పంపారని గుర్తించిన అత్తమామల ఇంటిముందు ఆందోళనకు దిగింది.తనను అమెరికాకు తిరిగి వెళ్లకుడా అడ్డుకున్నారని, అత్తింటి వారు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈ నెల 19న ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడచిన 8 నెలలుగా శ్రావ్య న్యాయపోరాటం చేస్తున్నారు.కేసు దర్యాప్తు ప్రారంభించిన ఉల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ శ్రావ్య, ఆమె తల్లిదండ్రులు, అత్తింటి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కాగా.. బుధవారం తిరిగి కౌన్సెలింగ్ జరగాల్సి ఉండడంతో శ్రావ్య, ఆమె కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. ఆమె అత్తింటి వారు మాత్రం రాలేదు. ఈ సందర్భంగా శ్రావ్య మీడియాతో మాట్లాడుతూ..అమెరికాలో తనను మానసిక క్షోభకు గురిచేశాడని.. ఇండియాలో వీసా స్టాంపింగ్ ఉందనే వంకతో 15 రోజుల ముందే తనను పంపాడని ఆరోపించింది.
Also Read : ‘విజ్జూ మాటిస్తున్నా.. నువ్వు గర్వపడేలా చేస్తా’ విజయ్ దేవరకొండకు రష్మిక ప్రామిస్
ఎన్ఆర్ఐ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ సస్సెన్సన్
కాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. కౌన్సెలింగ్ పేరుతో తమను స్టేషన్లో 12 గంటల పాటు నిర్బంధించారంటూ శ్రావ్య అత్తమామలు పెండ్లి పద్మజ, పెండ్లి ఉపేందర్రెడ్డి ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదని, దీంతో తన భార్య పద్మజ సొమ్మసిల్లిందని ఉపేందర్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాక సీఐ తమతో దురుసుగా ప్రవర్తించాడని వారు ఆరోపించారు. ఈ విషయంలో సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేసినట్లు ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ వ్యవహారంపై విచారించేందుకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ప్రసాదరావును ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రసాదరావు విచారణ ప్రారంభించారు.
ఇది కూడా చూడండి: Fruits and Milk: ఈ పండ్లు పాలు తాగితే శరీరంలో విషంగా మారుతుందా..? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..!!
psycho | medchal-district | illandu-constituency | illandu | bhadradri-kothagudem-district | bhadradri-kothagudem | crime news | husband | nri