/rtv/media/media_files/2025/05/31/BpuIGTZ2ImkrNINgmt7B.jpg)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీ లీడర్కు కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావుని నియామించారు ఆమె. ఈ మేరకు శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 2002 నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పని చేశారు.
Also Read : జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
Also Read : గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో
Ponnamaneni Balaji Rao Appointed As Secretary Of Kavitha
2001 నుంచి 2005 వరకు గ్రామ సర్పంచ్గా, 2019 నుంచి 2024 వరకు సుల్తానాబాద్ మండలం ఎంపీపీగా ఉన్నారు. తనను కార్యాలయ కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి బాలాజీ రావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జాగృతి పార్టీ కార్యాలయ కార్యకలాపాలపై పొన్నమనేని బాలాజీ రావుని 9849090215 నెంబరులో సంప్రదించగలరని పేర్కొన్నారు.
Also Read : పాక్ను తిడుతూ యువతి పోస్టు.. అరెస్టు చేసిన పోలీసులు
Also Read : పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్మ్యాప్ ఇదే..!
Ponnamaneni Balaji Rao | Telangana Jagruthi | office | hyderabad | latest-telugu-news | kalvakuntla-kavitha