Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న సూర్యుడు.. రానున్న రెండ్రోజులు జాగ్రత్త
తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తదితరులు ఈ రోజు సత్యనారాయణ రావును పరామర్శించారు.
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది.
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల మేర పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్లో 3.2 డిగ్రీలు పెరిగి 42.5 డిగ్రీలుగా నమోదయ్యింది.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ లు సంయుక్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్నాయి.
కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది.
కామారెడ్డి జిల్లాలో లోన్యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. సదాశివనగర్లో లోన్యాప్ వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా సందీప్ కు ఐదు నెలల క్రితమే సందీప్కు వివాహం అయింది.
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేటి నుంచి నాలుగు రోజులు పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. నేడు వనపర్తి, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.