Kavitha Vs Harish Rao: హరీష్ రావుపై నా కోపం అందుకే.. సంచలన చిట్ చాట్!
ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్పా.. మరే విషయంలో తనకు కోపం లేదన్నారు.
కొత్త పార్టీ పెట్టాలా? లేదా? అన్న అంశంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గతంలో కేసీఆర్ కూడా పార్టీ పెట్టేముందు వందల మందితో చర్చలు జరిపారన్నారు. ప్రస్తుతం తాను కూడా అదే చేస్తున్నానన్నారు. ఈ రోజు మీడియాతో ఆమె చిట్ చాట్ చేశారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మెదటి కూతురుని తానేనని అన్నారు. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్పా.. మరే విషయంలో తనకు కోపం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనకు ఫోన్ చేయలేదన్నారు.
కృష్ణా నీళ్లను వాళ్లు అక్కడ ఆపుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుంది : కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే నాగార్జున సాగర్ ని కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు
నాగార్జున సాగర్ లో చిన్న రిపేర్ చేయాలంటే రెండు మూడు నెలలు పడుతుంది
తాను కూడా కాంగ్రెస్ లో ఎవర్నీ అప్రోచ్ కాలేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్.. పదే పదే తన పేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో? అని అనుమానం వ్యక్తం చేశారు. ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. బీసీ ఇష్యూ తన మనస్సుకు దగ్గరగా అనిపించిందన్నారు. ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్ అని అన్నారు. తన ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. చాలామంది వచ్చి తనను కలుస్తున్నట్లు చెప్పారు. నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదని చెప్పారు.
అందుకే చింతమడకకు..
ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను జరుపుకునేందుకు తమ స్వగ్రామం చింతమడకను ఎంచుకోవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏళ్ల పాటు అక్కడ బతుకమ్మను జరుపుకున్నామన్నారు. వారు వచ్చి స్వయంగా ఆహ్వానించడంతో ఈ సారి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. గత ప్రభుత్వం అమలు చేసిన అనేక కార్యక్రమాలను నేటి కాంగ్రెస్ సర్కార్ వదిలేసిందన్నారు. ఈ క్రమంలోనే బతుకమ్మ చీరల పంపిణీని కూడా ఆపేసిందని ఫైర్ అయ్యారు.
Kavitha Vs Harish Rao: హరీష్ రావుపై నా కోపం అందుకే.. సంచలన చిట్ చాట్!
ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్పా.. మరే విషయంలో తనకు కోపం లేదన్నారు.
కొత్త పార్టీ పెట్టాలా? లేదా? అన్న అంశంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గతంలో కేసీఆర్ కూడా పార్టీ పెట్టేముందు వందల మందితో చర్చలు జరిపారన్నారు. ప్రస్తుతం తాను కూడా అదే చేస్తున్నానన్నారు. ఈ రోజు మీడియాతో ఆమె చిట్ చాట్ చేశారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మెదటి కూతురుని తానేనని అన్నారు. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్పా.. మరే విషయంలో తనకు కోపం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనకు ఫోన్ చేయలేదన్నారు.
తాను కూడా కాంగ్రెస్ లో ఎవర్నీ అప్రోచ్ కాలేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్.. పదే పదే తన పేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో? అని అనుమానం వ్యక్తం చేశారు. ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. బీసీ ఇష్యూ తన మనస్సుకు దగ్గరగా అనిపించిందన్నారు. ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్ అని అన్నారు. తన ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. చాలామంది వచ్చి తనను కలుస్తున్నట్లు చెప్పారు. నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదని చెప్పారు.
అందుకే చింతమడకకు..
ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను జరుపుకునేందుకు తమ స్వగ్రామం చింతమడకను ఎంచుకోవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏళ్ల పాటు అక్కడ బతుకమ్మను జరుపుకున్నామన్నారు. వారు వచ్చి స్వయంగా ఆహ్వానించడంతో ఈ సారి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. గత ప్రభుత్వం అమలు చేసిన అనేక కార్యక్రమాలను నేటి కాంగ్రెస్ సర్కార్ వదిలేసిందన్నారు. ఈ క్రమంలోనే బతుకమ్మ చీరల పంపిణీని కూడా ఆపేసిందని ఫైర్ అయ్యారు.