/rtv/media/media_files/2025/06/23/wife-murdered-husband-with-lover-2025-06-23-09-42-42.jpg)
WIFE MURDERED HUSBAND WITH LOVER
TG Crime : ఇష్టం లేకుంటే పెళ్లి చేసుకోవద్దు. లేదంటే తనకు ఇష్టమైన వాడితో వెళ్లిపోవచ్చు. కానీ ఈ మధ్య మహిళలు మరీ దారుణానికి ఒడిగడుతున్నారు. మనసులో ఒకరిని పెట్టుకుని..మనువు మరోకరిని చేసుకుని మనసుపడ్డవాడితో మనువాడిని వాడిని చంపిస్తున్నారు. వారి ప్రేమ పెళ్లి చేసుకున్నవారికి శాపంగా మారుతోంది. ఇలా ఒకటి రెండు కాదు..ఈ మధ్య జరుగుతున్న హత్యలన్నీ ఇలాంటివే.. మేఘాలయ హనీమూన్ మర్డర్ మొదలు కొని ఎన్నో సంఘటనలు. కర్కశంగా మారిన ఆడవారి చేతిల అమాయకులు బలవుతున్నారు. అలాంటిదే జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య. పెళ్లయిన నెల రోజులకే భార్య తన తల్లితో పాటు తల్లితో సంబంధం ఉన్న ఓ బ్యాంక్ మేనేజర్తో కలిసి భర్తను హత్య చేయించింది. సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
WIFE MURDERED HUSBAND WITH LOVER
తిరుమలరావు అనే వ్యక్తి కర్నూలులోని ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బ్యాంకులో చిరుద్యోగి అయిన, కల్లూరుకు చెందిన సుజాత అనే మహిళతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడింది. తరుచుగా ఇంటికి వస్తుండటంతో సుజాత కూతురు ఐ-శ్వర్యతోనూ తిరుమలరావుకు సంబంధం ఏర్పడింది.దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం బహిరంగ రహస్యమేనంటున్నారు.ఇదిలా ఉండగా ఐశ్వర్యకు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్తో పెళ్లి నిశ్చయమైంది. తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్గా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్తో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ తిరుమలరావును వదులుకోవడం ఐశ్వర్యకు ఇష్టం లేదు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్ల
దీంతో పెళ్లికి ఐదు రోజుల ముందు ఫిబ్రవరి 13న ఐశ్వర్య కనిపించకుండా పోయింది. అయితే పెళ్లి ఇష్టం లేని ఆమె బ్యాంక్ మేనేజర్తో లేచిపోయిందని అందరూ అనుకున్నారు.కానీ 16న తిరిగి వచ్చింది. తేజేశ్వర్కు ఫోన్ చేసి తనకు ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదని, కట్నం కోసం అమ్మ పడుతున్న బాధను చూడలేక స్నేహితురాలికి ఇంటికి వెళ్లానని నమ్మించింది. నువ్వంటే ఇష్టమని నీవు లేకుంటే బతకలేనని కన్నీళ్లు కార్చింది. కరిగిపోయిన తేజేశ్వర్ పెళ్లికి ఒప్పుకున్నాడు. అప్పటికే ఐశ్వర్యమీద అనుమానం ఉన్నా తేజేశ్వర్ తల్లిదండ్రులు పెళ్లి వద్దన్నారు. కానీ అతను వినలేదు. మే 18న ఐశ్వర్యతో పెళ్లయింది. కానీ ఆమె మనసంతా తిరుమలరావు చుట్టే తిరుగుతోంది. దీంతో గంటల తరబడి అతనితో మాట్లాడుతుండేది. ఇద నచ్చని తేజేశ్వర్ మందలించాడు. ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
ఐశ్వర్య మీద మోజు తగ్గని బ్యాంక్ మేనేజర్ తేజేశ్వర్ను అడ్డు తొలగించుకోవడానికి సిద్ధమయ్యాడు. కొంతమందికి సుపారీ ఇచ్చాడు. వారంతా ఒక పథకం ప్రకారం జూన్ 17న గద్వాలకు వచ్చి తేజేశ్వర్ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి నమ్మించారు. కారులో ఎక్కించుకుని తీసుకె వెళ్తూ కారులోనే అతనిపై కత్తులతో దాడిచేసి చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారవేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించింది. ఈ క్రమంలో తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఐదు రోజులకు తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఐశ్వర్య, సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు. కాగాసుపారీ గ్యాంగ్లో కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ మొబైల్తోపాటు భా ర్య, అత్త ఫోన్లను పోలీసులు ట్రేస్ చేసినట్లు తెలిపారు. ఐశర్య కనీసం 2000 సార్లు బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడినట్లు గుర్తించారు. పెళ్లి ఇష్టం లేకపోవడం మేనేజర్తో అక్రమ సంబంధం వదులుకోలేక పోవడమే హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
trump vs putin | sufari | Bank Manager | karnool | jogulamba-gadwal-district | telugu crime news | wife | husband | murder