TG Govt: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

డయాలసిస్‌ పేషెంట్లకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్ చెప్పింది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది. మే నెలలో 4,021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

New Update
Dialysis

Dialysis

TG Govt: డయాలసిస్‌ పేషెంట్లకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్ చెప్పింది.  వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపేందుకు గాను చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.  కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది. మే నెలలో 4,021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటినుంచి డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.2,016 పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో 4,011 మందికి డయాలసిస్ పెన్షన్లు వచ్చేవని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మరో కొంతమంది పేషెంట్లు పెరిగారని తెలిపింది. ఒక్క మే నెలలోనే ఎక్కువ మంది రోగులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. మంత్రి సీతక్క చొరవతో కొత్త లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి: యోగాసనాలు మహిళలకు ఓ వరం.. రోజూ చేస్తే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు

Also Read :  కాఫీ-తేనె కలిపి ముఖానికి రాస్తే ఆశ్చర్యపోయే అందం.. ఇలా వాడారంటే...!!

Good News For Telangana Pensioners

పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క చొరవతోనే నూతన లబ్ధిదారుల ఎంపిక జరిగి నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా డయాలసిస్ బాధితులు ఏ ప‌నిచేయ‌లేరు. ప్రతి నెల ఆసుప‌త్రిలో  డయాలసిస్‌ చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి డబ్బులు ఖర్చవుతుంటాయి. ఈ నేప‌ధ్యంలో వారి క‌ష్టాల‌ను గుర్తించిన ప్రభుత్వం వారికి పింఛన్లు మంజూరు చేసింది. వీరితో పాటు త్వరలో హెచ్‌ఐవీ బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే దాదాపు 13,000 మంది హెచ్‌ఐవీ పేషెంట్లు తమకు పెన్షన్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.
 త్వరలో అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతులు కోరింది.  అనుమతులు వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు అందించడం ప్రారంభిస్తారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు రూ.993 కోట్లు ఖర్చు చేస్తోంది.కొత్త పింఛన్‌ దారుల గుర్తింపు ప్రక్రియ పూర్తైతే ఇది మ‌రింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Also Read: డైరెక్టర్‌ మిస్సింగ్‌ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం

Also Read :  బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..

 

cm-revanthreddy | aasara-pensions | aasara-pension | telangana-govt | telangana govt good news | telangana government news

Advertisment
Advertisment
తాజా కథనాలు