Ahmedabad Plane Crash: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత మిస్సైన ఫిల్మ్ మేకర్ మహేష్ మృతి విమాన ప్రమాదంలోనే మరణించినట్లు తేలింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు అతడి మృతిని ధ్రువీకరించారు. నేలపై మరణించిన వారిలో మహేష్ కూడా ఉన్నట్లు నిర్దారించారు.  

New Update
Ahmedabad plane crash director found dead

Ahmedabad plane crash director found dead

జూన్ 12 జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని మొత్తాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.  ఈ ప్రమాదంలో ప్రయాణికులతో పాటు  స్థానిక నివాసితులు కలిపి 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విమానం కాలిపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టకుండా మారిపోయాయి. దీంతో DNA పరీక్షల ద్వారా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. 

Also Read :  దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్త - మామలు !

DNA పరీక్షతో నిర్దారణ 

ఈ క్రమంలో  అహ్మదాబాద్ విమాన ప్రమాదం  నుంచి మిస్సైన ఫిల్మ్ మేకర్ మహేష్ జిరవాలా మిస్టరీ  విషాదంగా ముగిసింది.  మహేష్ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా అతడి మృతిని నిర్దారించారు. ప్రయాణికులతో పాటు నేలపై మరణించిన వారిలో మహేష్ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  ప్రమాద స్థలంలో పూర్తిగా కాలిపోయిన   ద్విచక్ర వాహనం,  ఇంజిన్ నంబర్‌లను పరిశీలించగా అవి మహేష్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. జూన్ 12 గురువారం మధ్యాహ్నం ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లిన మహేష్ ఘటన స్థలానికి సమీపంలోనే  ఉండడంతో.. అతడు కూడా విమాన ప్రమాదంలో మరణించాడు. 

Also Read :  వరల్డ్ ప్యారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా!

700 మీటర్ల దూరంలో

అయితే  భార్య తెలిపిన వివరాల ప్రకారం.. విమాన ప్రమాదం జరిగిన  రోజు మధ్యాహ్నం మహేష్ ఘటన స్థలానికి సమీపంలోని  'లా గార్డెన్' ప్రాంతంలో  ఒక ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాడు.  చాలా సమయం అయినప్పటికీ మహేష్ తిరిగి రాకపోవడంతో భార్య హేతల్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో భార్య పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా  మహేష్ చివరి ఫోన్ లొకేషన్ ప్రమాద స్థలానికి దాదాపు 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు తేలింది. అలాగే  అతడి ఫోన్  విమానం టేకాఫ్ అయిన సరిగ్గా ఒక  నిమిషం తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యింది. 

దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు..  నేలమీద మరణించిన వారిలో మహేష్ కూడా ఉన్నారేమో అని నిర్ధారించుకోవడానికి  డీఎన్‌ఏ నమూనాలను అందించారు. చివరకు DNA శాంపిల్ పరీక్షించగా.. మహేష్ కూడా ఆ ప్రమాదంలో మరణించినట్లు తేలింది. మహేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.  డైరెక్టర్ మహేష్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Also Read: Kangana Ranaut: వరల్డ్ ప్యారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా!

Also Read :  సోషల్ మీడియాలో అందం చిట్కాలు ఎవరికి కోసమో తెలుసా..? సరైన సలహా లేకపోతే..!!

 

Ahmedabad Plane Crash | ahmedabad plane crash 2025

Advertisment
Advertisment
తాజా కథనాలు