Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలే...వర్షాలు!
తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.
తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.
నల్గొండలో దారుణం చోటుచేసుకుంది. పుట్టలగడ్డ తండాకు చెందిన నాగు నాయక్ ప్రేమ పేరుతో యువతిని నమ్మించి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడు. యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో హత్యకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
అధికార అహంకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వారి అరాచకాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. ఈ రోజు నల్గొండ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు.
ప్రియుడి మోజులో భర్తను కొడుకు కళ్లముందే కడతేర్చింది ఓ భార్య. సూర్యాపేట జిల్లా హనుమతండాకు చెందిన కౌసల్య మద్యం మత్తులో ఉన్న భర్త సైదాను గొడ్డలితో నరికి చంపింది. కొన్నాళ్లకు కొడుకు నిజం బయటపెట్టడంతో కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు.
TG: సూర్యాపేట జిల్లాలో సహకార సంఘం సమావేశం రసాభాస నెలకొంది. తమకు రుణమాఫీ కాలేదని రైతు సమావేశాన్ని అడ్డుకున్నారు. తమకు రుణమాఫీ అయ్యేవరకు కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. ఆఫీస్లోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.