Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?

ఖమ్మం జిల్లాకు చెందిన మహిళకు వీడియోకాల్‌ చేసి బెదిరించిన కేటుగాళ్లు రూ.26 లక్షలు కాజేశారు. బాధిత మహిళ అకౌంట్ నుంచి ఇల్లీగల్ లావాదేవీలు జరిగాయని బెదిరింపులకు దిగారు. సదరు మహిళను అరెస్ట్‌ చేస్తామని భయపెట్టి విడతల వారిగా రూ. 26 లక్షల 50 వేలు కొట్టేశారు.

New Update
School teacher loses over Rs 78 lakh in 22-day 'digital arrest

Digital arrest stir in Khammam.. How did they make Rs. 26 lakhs with a single call?

 Khammam Digital Arrest :  డబ్బులు కాజేసేందుకు సైబర్‌ నేరగాళ్లు ఎంచుకున్న కొత్తమార్గం డిజిటల్‌ అరెస్ట్‌. ఐపీఎస్‌, సీబీఐ, ఈడీ అధికారుల పేరిటి సైబర్‌ నేరగాళ్లు వీడియోకాల్‌ ద్వారా లైన్‌లోకి వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. డ్రగ్స్‌, మనీలాండరింగ్‌ ఇతర కారణాలతో అరెస్ట్‌ చేస్తున్నట్లు బెదిరిస్తారు.  వీడియో కాల్‌ కట్‌ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తారు. బెయిల్‌ మంజూరు చేయాలంటే తాము సూచించిన ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయాలని ముగ్గులోకి దించుతారు. ఇలా మాటలతోనే డబ్బులు దోచేస్తారు. తాజాగా ఖమ్మం లో  ఓ మహిళకు అదే పరిస్థితి ఎదురైంది. వీడియో కాల్‌ చేసి బెదిరించిన కేటుగాళ్లు రూ.26 లక్షల 50 వేలు కొట్టేశారు.

Also Read :  దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

ఇటీవల బాధిత మహిళకు వీడియోకాల్‌ చేసిన కేటుగాడు తనను తాను IPS దయానందగా  పరిచయం చేసుకున్నాడు. బాధిత మహిళ అకౌంట్ నుంచి ఇల్లీగల్ లావాదేవీలు జరిగాయని బెదిరింపులకు దిగాడు.17 మంది యువతులు బాధిత మహిళపై ఫిర్యాదు చేశారని బెదిరింపులకు దిగిన కేటుగాడు, ఈ విషయంలో సదరు మహిళను అరెస్ట్‌ చేస్తామని బెంగళూరు, ముంబై పోలీసుల పేరుతో విచారణ చేస్తున్నామని వెల్లడించారు. దీంతో మహిళ ఆందోళను గురికావడంతో అదే ఆసరాగా తీసుకుని అరెస్ట్‌ చేయకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  దీంతో చేసేదిలేక  సదరు మహిళ బ్యాంకులో ఉన్న నగదును కేటుగాళ్లు చూచించిన అకౌంట్‌కు పంపింది. అయినప్పటికీ మరింత డబ్బు కావాలని డిమాండ్‌ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన ఒంటిపై ఉన్న గోల్డ్‌ తాకట్టు పెట్టి కేటుగాళ్లకు పంపింది.

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

మహిళ అడిగిన కొద్ది డబ్బు పంపిస్తుండంతో మరోసారి కేటుగాళ్లు బెదిరింపులకు దిగారు. మరింత డబ్బును డిమాండ్ చేయడంతో ఆ మహిళ బంధువులను డబ్బు అవసరముందని అడిగింది బంధువులు ఆరా తీయడంతో తనకు వచ్చిన కాల్‌ తను డబ్బులు పంపించిన విషయాన్ని వెల్లడించింది. వారు అసలు విషయం చెప్పడంతో సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు