Warangal Old Woman Brutal Mur*der | డంబెల్ తో కొట్టి.. సిగరెట్లతో కాల్చి | Warangal Crime | RTV
వరంగల్ పట్టణానికి చెందిన ఉరగొండ సాయి పెళ్లయిన మూడు నెలలకు తన భార్య స్నేహితులతో కలిసి గోవాకు హనీమూన్ కు బయలు దేరాడు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నీళ్లబాటిల్ కోసం దిగిన సాయి కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో కాలుజారి పడిపోయి మృతి చెందాడు.
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రేమ జంటపై దాడి జరిగింది. బుధవారం సాయంత్రం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ పెళ్లి వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి బంధువులు దాడికి పాల్పడ్డారు.
పెళ్లి అయిన మూడు రోజులకే వరుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్లో జరిగింది. బయ్యారం మండలానికి చెందిన నరేశ్కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది. ఇంట్లో బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్కు షాక్ తగిలి మృతి చెందాడు.
తెలంగాణలో గతంలోనే రాతి యుగానికి సంబంధించిన ఆనవాళ్లు బయట పడగా, తాజాగా మన రాష్ట్రానికి అంతకంటే పూర్వపు చరిత్ర ఉందని తేలింది. మరో ప్రాచీన యుగానికి తెలంగాణ నిలయమని సుమారు 26 లక్షల సంవత్సరాల కంటే ముందే తెలంగాణ మనుగడ సాగించిందని తేలింది.
ప్రపంచ అందాల పోటీలకు తెలంగాణ ఆదిత్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన సుందీమణులు హైదరాబాద్ చేరుకున్నారు. కాగా పోటీల్లో భాగంగా నేడు అందగత్తెలంతా వరంగల్జిల్లాలో పర్యటించనున్నారు. రామప్ప, వరంగల్ కోట, వేయిస్తంభాల గుడిలో సందడి చేస్తారు.
ములుగు జిల్లాలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వెంకటాపురం సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు.
తెలంగాణ భూపాలపల్లిలో భయంకరమైన మర్డర్ అటెంప్ట్ జరిగింది. భూ వివాదంలో తన తండ్రిని చంపిన నిందితురాలు లక్ష్మీపై కాటారం పోలీస్ స్టేషన్లోనే అంజి గొడ్డలితో దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరారిలో ఉన్న నిందితుడికోసం గాలిస్తున్నారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గీసుకొండ నుంచి మొగిలిచెర్లకు వెళ్లే రహదారిపై రైతులు 30ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న కంకులను కత్తిరించి ఎండలో ఆరబెట్టారు. చొప్పను కాల్చే క్రమంలో పంటకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది.