/rtv/media/media_files/2025/05/05/5TFCMgRJ4KiNgxq4750X.jpg)
Bus Bhawan
TGSRTC : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యల పరిష్కారానికి సమ్మెకు పిలుపునిచ్చిన కార్మికులు సోమవారం సాయంత్రం వందలాది మందితో కవాతు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దనున్న బస్ భవన్ను తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున కార్మికులు బస్ భవన్ వైపు దూసుకు రావడంతో
బస్ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే కార్మికులు ముందుగానే తమ ఆందోళన విషయాన్ని ప్రకటించి ఉండడంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అదుపు చేశారు.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
గడచిన 16 నెలలుగా ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించిన ప్రభుత్వం స్పందించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సమ్మె నోటీసు కూడా ఇచ్చామని జేఏసీ నాయకులు తెలిపారు. నోటీసు ఇచ్చిన విధంగానే సమ్మె యధా విధిగా కొనసాగుతోందని ఆర్టీసీ జేఏసీ ఈ సందర్భంగా ప్రకటించింది. సమ్మె నేపథ్యంలో తమను ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోతాయని చెప్పారు. తమ సమ్మెకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. మే 7వ తేదీ నుంచి తాము తలపెట్టిన సమ్మె యధా విధిగా కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కార్మికుల కవాతు నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఇది కూడా చదవండి: Miss World 2025: హైదరాబాద్కు అందాల తారలు.. ఫొటోలు చూశారా?
కాగా ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటించారు. అయితే కార్మికుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. దీంతో మంగళవారం అర్థరాత్రి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. అయితే ఆర్టీసీలో ఉన్న ప్రైవేటు బస్సులను నడిపి ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read: కాళ్ల బేరానికి దిగిన పాకిస్తాన్.. ఐక్యరాజ్య సమితి ఎమర్జెన్సీ మీటింగ్