/rtv/media/media_files/2025/06/28/kalvakuntla-kavitha-2025-06-28-13-44-34.jpg)
Kalvakuntla Kavitha
MLC Kavita : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కలిపించాలని డిమాండ్ చేస్తూ జులై 17 రైల్ రోకోకు పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన దూకుడును మరింత పెంచింది. తన పోరాటానికి మద్దతు కూడకడుతూనే తన జాగృతి కార్యక్రమాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ్యుడు సందోష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన సందోష్ తో ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిసి పని చేస్తామని సందోష్ హామీ ఇచ్చారు. సీపీఐ సాంస్కృతిక యువ కళావాహిని వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో కలిసి సాహిత్య, సాంస్కృతిక అంశాల్లో పని చేస్తుందని సందోష్ స్పష్టం చేశారు.
Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!
గత కొంతకాలంగా కొత్త పార్టీ పెడుతుందని ప్రచాం సాగుతున్నప్పటికీ ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న కవిత తన తెలంగాణ జాగృతి కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. కాగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతున్నారు. దీనికోసం జులై 17న రైల్రోకో చేపడుతామని హెచ్చరించారు. దీనికోసం వివిధ పార్టీల మద్ధతు కూడ కడుతున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల ముఖ్య నాయకులను కలుస్తున్నారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
ఇటీవల తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో బేటీ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై జులై 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఆమె జాన్ వెస్లీని కోరారు. అంతకు ముందు బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను సైతం కవిత కలిసి మద్దతు కోరారు.ఆయన కవితకు పూర్తి మద్దతు పలికారు. తాజాగా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే స్వయంగా కవిత ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. బీసీ ఉద్యమం, 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కేంద్ర మంత్రి, కవిత మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
Also Read : జపాన్లో ‘ట్విటర్ కిల్లర్’ కు ఉరి