CRIME : జనగామలో అమానుషం.. ఆస్తికోసం తల్లిని చంపిన కూతురు

ఆస్తికోసం కన్నవారు, కడుపున పుట్టినవారు అనే బంధాలేవి పట్టించుకోకుండా కడతేర్చుతున్నారు. ప్రేమానుబంధాలను పక్కన పెట్టి పొట్టన పెట్టుకుంటున్నారు. ఆస్తి కోసం భర్తతో కలిసి కన్నతల్లిని మొఖంపై దిండుతో అదిమి చంపేసింది ఓ బిడ్డ. ఈ ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది.

New Update
Daughter kills mother for property

Daughter kills mother for property

ఆస్తికోసం కన్నవారు, కడుపున పుట్టినవారు అనే బంధాలేవి పట్టించుకోకుండా కడతేర్చుతున్నారు. ప్రేమానుబంధాలను పక్కన పెట్టి పొట్టన పెట్టుకుంటున్నారు. ఆస్తి కోసం భర్తతో కలిసి కన్నతల్లిని మొఖంపై దిండుతో అదిమి చంపేసింది ఓ బిడ్డ(Daughter Kills Mother). ఈ ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని పాలకుర్తి మండలం పెద్ద తండా(కె) కు చెందిన బాదావత్ లక్ష్మి(45) భర్త 20 ఏండ్ల క్రితం చనిపోయాడు. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు సంగీతను పెంచి పెద్ద చేసింది. ఐదేండ్ల క్రితం శాతాపురం గ్రామానికి చెందిన భూక్య వీరన్నను ప్రేమించానని కూతురు చెప్పగా తనకున్న మూడెకరాల పది గుంటల భూమిలో రెండు ఎకరాలు అమ్మి కట్న కానుకలు ఇచ్చి పెండ్లి చేసింది. ఆడపడుచులకు 20 గుంటలు రాసి ఇచ్చింది.మిగిలిన 30 గుంటల భూమిని మాత్రం తన పేరుమీద ఉంచుకుని వ్యవసాయం చేసుకుంటుంది. అయితే మిగిలిన 30 గుంటల భూమి తమకే ఇవ్వాలని కొంతకాలంగా కూతురు అల్లుడు గొడవ వేధిస్తున్నారు.

లక్ష్మి పేరిట ఉన్న భూమిని తమ పేరున రాసివ్వాలంటూ కూతురు సంగీత, అల్లుడు వీరన్న పలుమార్లు గొడవలకు కూడా దిగారు. తాను బ్రతికున్నంతకాలం భూమి ఇచ్చేది లేదని తన తదనంతరం వారికే చెందుతుందని లక్ష్మి తేల్చి చెప్పింది.  దీంతో తల్లిపై సంగీత కక్ష్య పెంచుకుంది.-- లక్ష్మీ ఒప్పుకోకపోవడంతో తల్లి హత్యకు సంగీత స్కెచ్ వేసింది. నిన్న కారులో భర్తతో కలిసి ఇంటికి వచ్చింది సంగీత. అయితే -- తెల్లారేసరికి అనుమానాస్పద రీతిలో లక్ష్మి మృతిచెందింది. అయితే ఉదయం లక్ష్మిని కూలీ పనికి పిలిచేందుకు చుట్టుపక్కన ఉండే మహిళలు వెళ్ళగా లక్ష్మీ నిద్ర లేవలేదు. దీంతో తన తల్లి నిద్రలోనే చనిపోయినట్లు నటిస్తూ శవం మీద పడి  సంగీత ఏడ్వటం మొదలు పెట్టింది. అయితే మెడపై గాయాలతో అనుమానాస్పదంగా చనిపోయినట్టు గుర్తించిన మహిళలు పోలీసులకు సమాచారం అందించారు.  కాగా పోలీసులు వచ్చి విచారించగా  అర్ధరాత్రి  నిద్రలో ఉన్న లక్ష్మి మొఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు అంగీకరించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

Also Read :  తెలంగాణలో దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

వదిన గొంతు పిసికి చంపిన మరిది

బంగారం, డబ్బుల కోసం భార్య, కొడుకుతో కలిసి వృద్ధాప్యంలో ఉన్న సొంత వదినను గొంతు నులిమి చంపేశాడు ఓ మరిది. నిజామాబాద్ జిల్లా సాలూరలో ఈ దారుణం చోటు చేసుకుంది. సాలూర మండల కేంద్రానికి చెందిన కట్టం నాగవ్వ(65) భర్త కొన్నేండ్ల క్రితం చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో మరిది కుటుంబంతోపాటు కలిసి ఉంటోంది. అయితే, వృద్ధాప్యంలో ఉన్న నాగవ్వను పోషించడం తమకు భారంగా భావించారు మరిది కట్టం చిన్న గంగారాం, అతడి భార్య కళావతి, కొడుకు గణేశ్‌. దీంతో నాగవ్వను చంపేస్తే ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బులు కూడా తమకు చెందుతాయని ప్లాన్ వేశారు. మంగళవారం రాత్రి ముగ్గురూ కలిసి ఆమెను గొంతు నులిమి చంపారు. అయితే అనుమాన వచ్చిన నాగవ్వ మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.  

Also Read :  దారుణం.. ఫ్రిడ్జ్‌లో శిశువును పెట్టి నిద్రపోయిన తల్లి, చివరికి

Advertisment
తాజా కథనాలు