భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో మహబూబాబాద్కు చెందిన మాజీ సైనికుడు intelligence inspector శ్రీనివాస్ RTVకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒళ్లు గగుళ్లుపుడిచే మాటలు మాటలాడారు. ‘‘ఊర్లలో ఉండే యువకుల్లారా.. మాజీ సైనికుల్లారా.. దేశం కోసం పోరాడుదాం రండి. సరిహద్దులో సైనికులకు తోడుగా నిలుద్దాం.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
తరలి రండి యువకుల్లారా
తరలి రండి.. గ్రామాల్లో ఉండే పెద్దలు వారిని ప్రోత్సహించండి. వారికి భరోసానివ్వండి.. ఏం జరిగినా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పండి. నా ఆస్తిని అమ్మి అయినా నేను యుద్ధానికి బయలుదేరుతాను. నాతో వచ్చేది ఎవరు?. ఇలాంటి సమయంలో మాజీ సైనికులంతా ఒక్కటవుదాం. యుద్ద వాతావరణంలో RTV ఛానెల్లో వస్తున్న వార్తలు నాలో మరింత రక్తం మరిగేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశ సైనికుల బూట్లు తుడిచిన జన్మ ధన్యమే అవుతుంది.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!
పాకిస్తాన్ లో ఇప్పటికే అధికారులు భయంతో రాజీనామా చేస్తున్నారు. కానీ మేము దేశం కోసం సైన్యంలో పాల్గొనడం కోసం ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేస్తాం. దేశం కోసం వచ్చే దేశభక్తులకు సహాయక చర్యలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. ఈ సమయంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసుకోకుండా, టైంపాస్ చేస్తూ, ఫంక్షన్లకు పోతూ, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ పార్టీ మీటింగ్ లు పెట్టుకుంటూ దాన్ని ఖండిస్తూ దీన్ని ఖండిస్తూ ఉన్న ప్రతి వాడు దేశద్రోహి అవుతాడు. ఖబర్దార్ దేశద్రోహులారా.
టెక్నాలజీతో ప్రస్తుతానికి యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరికి ఎన్ని ఫ్యాషన్లు ఉన్నా యుద్ధం అయిపోయిన తర్వాత మీ కల నెరవేర్చుకోండి. గ్రామంలో ఉన్న పెద్దలు సైన్యంలో ఉన్నవాళ్లకి, సైన్యంలోకి వెళ్లాలనుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వండి. వందకోట్ల సైనికులం వందేమాతరం.. మాజోలికి రావడం ఎవరితరం కాదు. దేశం కోసం అన్ని కులాలు, అన్ని మతాలు పనిచేస్తున్నాయి. యుద్ధం ఆగితే మాజీ సైనికులంతా కలిసి పహల్గామ్ ప్రాంతంలో ర్యాలీగా తిరుగుతాం.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
భద్రత లేదనుకునే వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా టూరిస్టులకు భయం లేకుండా చేసేందుకు ర్యాలీ చేస్తాం. తీవ్రవాదులు పన్నిన పన్నాగంలో మనం కొట్టుకు చావకూడదు. మాజీ సైనికుల సంఘం దేశం కోసం పనిచేయాలి. మహబూబాబాద్ నుంచి బెంగళూరులో ట్రైనింగ్ సెంటర్ వరకు పాదయాత్రగా వెళతాను. నాతో పాటు మాజీ సైనికులను ఇన్వై ట్ చేస్తాను.
Also Read: ఇజ్రాయెల్లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ నా పదవికి లాంగ్ లీవ్ ఇవ్వాలి. యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ అధికారులు, సైనికులు రాజీనామ చేసి వెళ్లిపోయారని ఆర్టీవీ ఛానెల్ లోనే విన్నాను. కానీ భారతదేశంలో మాత్రం మాజీ సైనికులు దేశం కోసం ముందుకు వస్తున్నారు. నా కోపం పాకిస్థాన్ ప్రజల మీద కాదు. పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్ ఉగ్రనాయకుల మీద.’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ind-vs-pak | india war | Pak India War | Pakistan india War | pakistan vs india war | latest-telugu-news | telugu-news