పాక్ మిస్సైల్స్ తో ఆడుకున్న భారత చిన్నారులు| Indian Children Play With Pakistan Missiles | War | RTV
భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో పరిస్థితి మరింత చేయి దాటక ముందే భారత్తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్థాన్ను అమెరికా కోరింది. ఈమేరకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.
భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రికులను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటిలిజన్స్రిపోర్టుతో చార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ ల మధ్క ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీశాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారతదేశానికి మద్ధతుగా నిలిచాయి. కానీ, పాక్కు టర్కీ, అజర్బైజాన్ మద్దతుగా నిలిచాయి. దీంతో అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీలు ఆ దేశాలకు షాకిచ్చాయి.
భారత్, పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో బలూచిస్తాన్ తన పోరాటాన్నితీవ్రతరం చేసింది. పాక్ ఆర్మీ స్థావరాలుగా ఉన్న క్వెట్టా, ఉతల్, సోహ్బత్పూర్, పంజ్గుర్ ప్రాంతాల్లో దాడులు కొనసాగించింది. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని బలూచ్ జెండాలు ఎగురవేసింది.
పాకిస్తాన్ డ్రోన్ల దాడిని ఇండియన్ ఆర్మీకి చెందిన ‘హర్పి డ్రోన్స్’ సమర్ధవంతంగా అడ్డుకున్నాయి. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను హర్పి డ్రోన్స్ తుక్కు చేసాయి. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఈ డ్రోన్స్ 1000 కిలోమీటర్ల రేంజ్, 135కిలోల బరువును కలిగి ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్లో హై అలెర్ట్ జారీ అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని పోలీసు సిబ్బంది సెలవులను అధికారులు రద్దు చేశారు. అలాగే ముందు జాగ్రత్తగా ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి.