/rtv/media/media_files/2025/05/09/5tE24cfYQzz2VO2zS17t.jpg)
IND-PAK WAR Police high alert in Hyderabad
Hyderabad High Alert: భారత్, పాక్ యుద్ధం(India Pakistan War) ఎఫెక్ట్తో హైదరాబాద్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పబ్లిక్ ప్లేస్లు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఐటీ కారిడార్, రక్షణ సంస్థల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అనుమానస్పద వ్యక్తులు, ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
— RTV (@RTVnewsnetwork) May 9, 2025
ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరిక
పాకిస్తాన్ స్లీపర్ సేల్స్ పేరుతో బెదిరింపు మెయిల్
ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టిన అధికారులు
మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందనే దానిపై ఆరా..#shamshabadairport #BombThreat #RTV pic.twitter.com/x9XIDsHGzi
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
డాగ్ స్కాడ్, క్లూస్ టీం తనిఖీలు..
ఈ మేరకు ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఇందులో భాగంగానే ఛార్మినార్, గోల్కొండకోట, సచివాలయం, ఐటీ కారిడార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, రాచకొండ తదితర ప్రాంతాల్లో డాగ్ స్కాడ్, క్లూస్ టీం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పార్క్ చేసిన పాత వాహనాలు, ఇతర రాష్ట్రాల బస్సులు, అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని పరిశీలిస్తున్నారు.
Also Read: పాక్కు దెబ్బ మీద దెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన!
మరోవైపు నగరంలో మిస్ వరల్డ్ పోటీలు జరగనుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీలకు భారీ సెక్యూరిటీ కల్పించాలని, పోటీలు నిర్వహించే ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు.శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసుల సమన్వయంతో సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు 3 గంటల ముందే విమానాశ్రయానికి రావాలని సూచించారు.
Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్లోకి తరలింపు
ind pak war | hyderabad | high-alert | today telugu news