BIG BREAKING: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన!

పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు అంశంలో జోక్యం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను ప్రపంచబ్యాంక్ ఖండించింది. ఈ అంశంలో తాము కలగజేసుకోవట్లేదని అధ్యక్షుడు అజయ్ బంగా స్పష్టం చేశారు. అర్థంలేని పుకార్లను నమొద్దని, ప్రపంచబ్యాక్ ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందన్నారు. 

New Update
ind pak

India and Pak Indus Water issue World Bank responded

BIG BREAKING: పాకిస్తాన్ గత రాత్రి ఇండియాపై కాల్పులకు పాల్పడటంతో భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తోంది. తాజాగా సింధుజలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా.. ఇందులో తాము ఎలాంటి జోక్యం చేసుకోవట్లేదని స్పష్టం చేశారు. 

ఈ మేరకు పాక్, ఇండియా సింధుజలాల ఒప్పందంలో ప్రపంచబ్యాంక్ జోక్యం చేసుకుందనే వార్తలపై స్పందించింది. ప్రస్తుతం బంగా భారత్‌లో పర్యటిస్తున్న ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు బంగా.. ఈ ఒప్పందం విషయంలో తాము జోక్యం చేసుకొమని తెలిపారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయని, అవన్నీ అర్థం లేనివని అన్నారు. ప్రపంచబ్యాక్ పాత్ర ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని తెలిపారు. 

ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతోనే సింధు, దీని ఉపనదుల నీటిని పంచుకోవడానికి  భారత్, పాక్ మధ్య ఒప్పందం కుదిరింది. 1960 సెప్టెంబరు అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. దీని ఆధారంగా సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్‌ నదులపై భారత్ హక్కులు పొందగా.. ఏడాదికి 33 మిలియన్‌ ఎకరాల అడుగులు (MAF)గా ఉంది. ఇక సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌ హక్కులు పాక్ కు చెందాయి.

Also Read: 'నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు'.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!

 అయితే సింధు నదీ నీటి పంపిణీ ఒప్పందం రూల్స్ పునఃసమీక్షించాలని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. అప్పుడు ఒప్పందం కుదిరినా.. ఇప్పుడు ఇరుదేశాల్లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకొని ఒప్పందం సమీక్షించాల్సి భారత్‌ కోరుతోంది. కానీ పాక్‌ దీనిని వ్యతిరేకిస్తోంది. కానీ పహల్గాం ఎఫెక్టుతో ఈ ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు ఇండియా స్పష్టం చేసింది. మరోవైపు ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న అజయ్ బంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగితో భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

Advertisment
Advertisment
తాజా కథనాలు