India and Pakistan war : కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం, పాకిస్థాన్ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు సైనిక చర్యలను నిలిపివేశామని తేల్చి చెప్పారు.