Famous Women: షర్మిల, విజయ శాంతి, లక్ష్మీ పార్వతీతోపాటు రాజకీయ పార్టీలు నడిపిన నాయకురాళ్లు వీరే..!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మహిళలు యాక్టీవ్‌గానే ఉన్నారు. లక్ష్మీ పార్వతీ ఎన్టీఆర్ తెలుగు దేశం, విజయ శాంతి తెలంగాణ ఇంటి పార్టీ, షర్మిలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు పెట్టారు. కవిత కూడా ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని వార్తలు వస్తున్నాయి.

New Update
women in political parties

కాలం మారింది.. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. 25ఏళ్ల చరిత్ర గల బీఆర్ఎస్ పార్టీలో కవిత ఓ సంచలనంగా మారారు. సొంత పార్టీ నేతలపై ఆగ్రహంగా ఉన్న ఆమె కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆమె తీరు, వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. బహిర్గతంగా చెప్పలేదు. కానీ కవిత సొంత సంస్థ తెలంగాణ జాగృతిని యాక్టీవ్ చేస్తున్నారు. పాత నాయకులను కలుస్తున్నారు. ఈక్రమంలో కవిత రాజకీయ పార్టీ పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. దేశంలో, తెలుగు రాష్ట్రంలో పొలిటికల్ పార్టీలు పెట్టి నడిపినవారు. అలాంటి వాళ్లలో ప్రస్తుతం మమత బెనర్జీని ఆదర్శంగా చెప్పుకోవచ్చు.

బీజేపీ రాజకీయాల్ని తట్టుకొని ఆమె స్థాపించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీని ప్రాబల్యాన్ని చూపుతున్నారు. అలాంటి వారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ పెట్టిన మహిళలు ఇప్పటివరకు ముగ్గురు ఉన్నారు. ఆయా పార్టీలతో వారు జనాల్లోకి వెళ్లలేక పోయారు. కానీ వేరు పార్టీలో ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నారు. 

Also Read :  KCRకు BRS, జాగృతి రెండు కళ్లు.. త్వరలో రైల్ రోకో

విజయశాంతి - తల్లి తెలంగాణ పార్టీ 2005 

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించిన విజయశాంతి రాజకీయాల్లో వచ్చి రాణించారు. విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. విజయశాంతిని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 2020 డిసెంబరు 07న భారతీయ జనతా పార్టీలో చేరి, 2023 నవంబరు 15న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డికి రాజీనామా లేఖను పంపింది. ఆమె నవంబరు 17న హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు.

Also Read :  చెడు ఆలోచన ఉన్నవారికి ఈ అలవాట్లు ఉంటాయి.. ఇవి కనిపిస్తే వెంటనే దూరంగా ఉండండి!

షర్మిల - వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ

2021 ఫిబ్రవరిలో షర్మిలకు అన్న జగన్‌తో రాజకీయ విభేదాలు వచ్చాయి. జగన్ పెట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదని ఆమె అన్నారు. 2021 ఏప్రిల్ 9న, షర్మిల జూలై 8, 2021న తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించారు. ఆమె తండ్రి రాజశేఖర రెడ్డి జన్మదినం కావడంతో ఆమె ఆ తేదీని ఎంచుకుంది. పార్టీ ప్రారంభానికి ముందు, ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. జూలై 8, 2021న ఆమె వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటును ప్రకటించింది. అప్పుడు ఆమె తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. 2024 జనవరి 4న ఆమె వైయస్ఆర్ తెలంగాణ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేసింది. YSRTPని INCలో విలీనం చేసిన తర్వాత, షర్మిల న్యూఢిల్లీలో AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు.

Also Read :  గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో

లక్ష్మీపర్వతీ - ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ

ఎన్టీఆర్ తో వివాహం తర్వాత లక్ష్మీ పార్వతి రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. అంతకు ముందు కూడా తెలుగు దేశం పార్టీలో ఆమె కీలకంగా ఉండేవారు. 1993లో ఆమె ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఆమె పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి NTRTDP (LP) కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుండి 42 లోక్‌సభ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికల్లో మొత్తం 3,249,267 ఓట్లు సాధించింది కానీ ఏ సీట్లను గెలవలేకపోయింది. 1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో , పార్వతి సోంపేట అసెంబ్లీ నియోజకవర్గం, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆమె రెండు నియోజకవర్గాలలో ఓడిపోయింది. ఏలూరులో కేవలం 1,500 ఓట్లను మాత్రమే సాధించింది. తర్వాత పార్వతి NTRTDP (LP) అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 2011లో YSR కాంగ్రెస్ పార్టీలో చేరారు. YCP హయాంలో ఆమె తెలుగు అకాడమీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

తమిళనాడులో MGR పెట్టిన అన్నా డీఎంకే పార్టీని జయలలిత కొన్నిరోజులు నడిపారు. ఆమె నేతృత్వంలో పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్లింది. కాన్షీరామ్ పెట్టిన బహుజన్ సమాజ్ పార్టీ వారసురాలిగా 2001లో మాయావతిని పేర్కొన్నాడు.  2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో అది దేశంలోనే రెండో ప్రధాన పార్టీగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో పెద్ద పార్టీ. యామావతి ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ప్రియాంక గాంధీ కూడా. గతంలో బీజేపీ పార్టీలో సుష్మ స్వరాజ్ లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 

Also Read :  జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

sharmila | ap-chief-sharmila | kavitha | brs-kavitha | vijaya-shanthi | congress | Telugu Political News | telugu politics | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు