కల్వకుంట్ల కవిత శనివారం జూబ్లీహిల్స్లో జాగృతి కొత్త ఆఫీస్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్ల లాంటివని అన్నారు. తెలంగాణ జాగృతి ప్రారంభించి 18ఏళ్లు అవుతుందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రతి ఉద్యమంలో జాగృతి భాగమైంది. ఉద్యమ సమయంలో జాగృతి ఎన్నో తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడిందని కవిత గుర్తుచేశారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్పూర్తితో తెలంగాణ జాగృతి పుట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణ అని కూడా అనరని ఆమె విమర్శించారు. రాజీవ్ యువ వికాసం అని కాదు.. తెలంగాణ యువ వికాసం అనే పేరుతో పథకాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణ జాతికి మేలు చేసినందుకే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. కాళేశ్వరం విచారణలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన విషయంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని అన్నారు. కేసీఆర్పై ఈగ వాలినా చూస్తూ ఊరుకోమని కవిత హెచ్చరించారు. స్తానిక సంస్థల ఎన్నికల లోపే బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని ఆమె అన్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకుంటే రైల్ రోకో కార్యక్రమం చేపడతామని కల్వకుంట్ల కవిత చెప్పారు. అయితే చివరిగా జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి అని నినాదాలతో ప్రసంగాన్ని ఆమె ముగించారు. జై బీఆర్ఎస్ అని మాత్రం అనలేదు కవిత.
kavitha | brs-kavitha | Telangana Jagruthi | kcr | telangana | latest-telugu-news