AP Crime: ఏపీలో తల్లి కొడుకు మృతి వెనుక ఉన్న ఘోర నిజాలు

కాకినాడలోని రేచర్లపేటలో తల్లీకొడుకుల మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలు రమ్యదీప్తి కుమారుడు ప్రశాంత్‌ను హత్య చేసి తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటానికి భర్త వేధింపులే కారణమని వాయిస్ రికార్డ్‌తోపాటు పోలీసుల విచారణలో తేలింది.

New Update

AP Crime: కాకినాడ నగరంలోని రేచర్లపేటలో తల్లీకొడుకుల మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న నాలుగేళ్ల కొడుకుని హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతురాలు రమ్యదీప్తి అనే మహిళ తన కుమారుడు ప్రశాంత్‌ను హత్య చేసి తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. చిన్నారిని చంపేందుకు ఆమె అతని నోరు, ముక్కు, కళ్ళు ప్లాస్టర్లతో మూసి ఊపిరాడకుండా చేశారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. తాను ఎందుకు ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందో వివరించేలా ఆమె తల్లికి ఓ వాయిస్ రికార్డ్ పంపినట్లు సమాచారం.

భర్త కుటుంబం వేధింపులతో..

వీరిద్దరి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన వెనుక భార్యను అత్తింటి వేధింపులు గురిచేశాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాయిస్ మెసేజ్‌లో రమ్యదీప్తి తెలిపిన వివరాలు ప్రకారం.. తన భర్త రాజాల శరత్‌బాబు, అతని తల్లి, చెల్లెలు కలిసి తనను మానసికంగా వేధించారని, తనపై అనుమానంతో ఇంట్లో బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టి తన ప్రైవసీకి భంగం కలిగించారని ఆమె ఆరోపించింది. భర్త దుర్గుణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. రమ్యదీప్తి తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామానికి చెందినవారు. 

ఇది కూడా చదవండి: బరువు తగ్గాలా? తిన్న తర్వాత ఎంతసేపు నడవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

2020లో కాకినాడకు చెందిన శరత్‌బాబుతో ఆమె వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అతని కుటుంబానికి రూ. 7.50 లక్షల డబ్బు, 10 కాసుల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు.  పెళ్లి అనంతరం రమ్యదీప్తిని శరత్‌బాబు అబుదాబికి తీసుకెళ్లాడు. అక్కడ కొంతకాలం  జీవితం కొనసాగించారు. ఇటీవలి కాలంలో రమ్యదీప్తి తల్లిని కలిసి తన పరిస్థితిపై కన్నీటి మున్నెత్తినట్లు తెలుస్తోంది. భర్త కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని చెప్పిన ఆమె 15 రోజుల క్రితం కాకినాడకు వచ్చిన శరత్‌బాబుతో విడిగా ఉంది. అయితే వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లిన రమ్యదీప్తి చివరకు కొడుకును హతమార్చి తాను ప్రాణాలు తీసుకుందిం. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రమ్యదీప్తి తల్లి, బంధువులు మాత్రం ఇది ఆత్మహత్య కాదు.. ప్లాన్ చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఆమెను చంపి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశారని వారు స్పష్టం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, డిజిటల్ ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగుతోంది. 

ఇది కూడా చదవండి: బాచుపల్లి సూట్‌కేస్ హత్య మిస్టరీ.. నాలుగు ప్రత్యేక బృందాలతో..!!

( ap crime latest updates | ap crime updates | ap-crime-news | Latest News | crime news )

Advertisment
Advertisment
తాజా కథనాలు