Bengaluru Stampede: బెంగళూరు ఘటనపై ప్రభుత్వం దూకుడు...కొనసాగుతున్న అరెస్టుల పర్వం

ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటపై ప్రభుత్వం దర్యాప్తును  వేగవంతం చేసింది. ఇప్పటికే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు మార్కెటింగ్‌ హెడ్‌ నిఖిల్ సొసాలేను శుక్రవారం అరెస్టు చేసింది.

New Update
Bengaluru Stampede

Bengaluru Stampede

Bengaluru Stampede:

ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటపై ప్రభుత్వం దర్యాప్తును  వేగవంతం చేసింది. ఇప్పటికే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు మార్కెటింగ్‌ హెడ్‌ నిఖిల్ సొసాలే(Nikhil Sosale)ను శుక్రవారం అరెస్టు చేసింది. ఆయనతో పాటు విజయోత్సవ ఈవెంట్‌ నిర్వాహక సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌(DNA Entertainment Networks Private Limited)కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV News App Download Links: 

ఆండ్రాయిడ్(Android) వినియోగదారులు: https://t.co/B1FaPB6Zsr

IOS వినియోగదారులు: https://t.co/4nRQaLbtfv

అటు కర్ణాటక హైకోర్టు(High Court of Karnataka) కూడా ఘటనను సుమోటోగా పరిగణించి విచారణ నిర్వహించింది. లక్షలమంది క్రీడాభిమానులతో ముడిపడిన కార్యక్రమాన్ని నిర్వహించటంలో వైఫల్యం ఎవరిదో తేల్చిచెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు సూచనతో రాష్ట్ర ప్రభుత్వం తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఘటనకు కర్ణాటక క్రికెట్‌ సమాఖ్య, ఆర్‌సీబీ ప్రతినిధులను బాధ్యులుగా పేర్కొంటూ తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజా అరెస్టులు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన కార్యదర్శి శంకర్, కోశాధికారి జయరామ్ పరారీలో ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

కాగా ఇప్పటికే దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఆర్‌సిబిని మొదటి నిందితుడిగా, డిఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రెండవ నిందితుడిగా, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీని మూడవ నిందితుడిగా చేర్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన అనుమతి తీసుకోలేదని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. RCB, DNA ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అవసరమైన అనుమతి లేకుండానే విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన తర్వాత చట్టపరమైన చర్యలకు సహకరిస్తామని RCB తెలిపింది.

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్-2025 ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 17 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది ఫైనల్స్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. అయితే ఈ సందర్భంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ ఘటనలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

RTV LIVE Telugu News App
Advertisment
Advertisment
తాజా కథనాలు