Eatala Rajendar : ముగిసిన ఈటల రాజేందర్ విచారణ... ఆయన ఏం చెప్పారంటే...
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.