KCR Family: ఆప్ ఓటమితో బీఆర్ఎస్‌లో మొదలైన టెన్షన్.. కవిత మళ్లీ జైలుకు!?

ఢిల్లీలో ఆప్ ఓటమితో కేసీఆర్ ఫ్యామిలీలో టెన్షన్ మొదలైంది. లిక్కర్ స్కామ్‌ను అడ్డంపెట్టుకుని ఆప్, బీఆర్ఎస్‌ను నామారూపాల్లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేసిన బీజేపీ..కేజ్రీవాల్, కవితను మరోసారి జైలుకు పంపిచాలని ప్లాన్ చేస్తోంది. 

New Update
kcr kavitha

Delhi Election Effect tenson start in KCR Family For Liquor Scam

KCR Family: ఢిల్లీలో ఆప్ ఓటమితో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైంది. కేజ్రీవాల్ ఓటమితో ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని పోలీసులను బీజేపీ ఆదేశించడం సంచలనం రేపుతోంది. ఆర్డర్స్ ఫైల్స్ బయటకు వెళ్లకుండా చూడాలని చెప్పడంతో కేజ్రీవాల్, కవిత మరోసారి జైలుకు వెళ్లనున్నారనే చర్చ మొదలైంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీజేపీ మరోసారి ఎంక్వైరీ చేస్తే కేజ్రీవాల్, కవిత మరోసారి జైలుకు వెళ్లే పరిస్థితులున్నట్లు చర్చ నడుస్తోంది. 

ఆప్, బీఆర్ఎస్ ను నామరూపాల్లేకుండా చేయాలని..

ఢిల్లీ పీఠం చేజిక్కించుకున్న బీజేపీ ఢిల్లీలో ఆప్, తెలంగాణలోనూ బీఆర్ఎస్ ను నామరూపాల్లేకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ గెలవబోతుందంటూ బండి సంజయ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్లే ఆప్ ఓడిపోయిందని, దానికి ముఖ్య కారణం కవితనే అనే విమర్శలు వస్తున్నాయి. కేజ్రీవాల్, కవితను మరోసారి జైలులో వేసేందుకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ మొత్తాన్ని బయటకు తీస్తామని బీజేపీ నేతలు ప్రకటించగా.. సీఎం ఆఫీసు నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లొ్ద్దని, హార్డ్ డిస్క్, మెయిల్స్ తదితర ఏ ఆధారం ఆఫీసు దాటి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  

ఇది కూడా చదవండి: Delhi Results: 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలుపు.. ప్రధాన కారణాలు ఇవే !

లిక్కర్ స్కామ్‌పై పూర్తిస్థాయిలో విచారణ..

ఈ నేపథ్యంలో కవిత జైలుకు వెళ్లడం ఖాయమనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరందుకుంది. ఢిల్లీ సచివాలయం బయట భారీగా పోలీసులు మోహరించడంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామని బీజేపీ ప్రకటించగా చర్యలు తప్పవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల అధికారిక నివాసం నుంచి కూడా ఏ పేపర్, ఎలక్ట్రానిక్ పరికరం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో లిక్కర్ స్కామ్ ప్రతి ఫైల్ క్షుణ్ణంగా పరిశీలించి బీఆర్ఎస్, ఆప్ ను చావుదెబ్బ కొట్టేందుకు చేసేందుకు బీజేపీ భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: Swati Maliwal : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు