/rtv/media/media_files/2025/02/08/Atxpok0658AU6AWImR0a.jpg)
Swati Maliwal
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Delhi Assembly Election Results 2025) వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal) చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ చిత్రంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను ఆమె షేర్ చేశారు. నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం తనకు జరిగిందని ఆమె పరోక్షంగా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : పార్టీ ఓడినా.. ఆమె గెలిచింది.. AAPకు ఇక పెద్ద దిక్కు అతిషే!
Swati Maliwal's Draupadi Post Goes Viral
— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025
Also Read : స్థానిక ఎన్నికలకు సై....ప్రభుత్వానికి కలిసొచ్చేనా?
గతేడాది కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడిని ఆమె ఈ విధంగా ప్రస్తావించారు. కాగా 2024మేలో స్వాతి మలివాల్ పై కేజ్రీవాల్ నివాసంలోనే దాడి జరిగినట్టుగా ఆరోపణలు కలకలం రేపాయి. తనపై కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడినట్టు ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ముందే తన పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించినట్టు అప్పట్లో ఆమె వెల్లడించారు.
Also Read : ఇది చారిత్రాత్మకమైన తీర్పు.. ఢిల్లీ రిజల్ట్స్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!
Also Read : ప్రచారంలో ఆ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. ఇంతకీ అతను గెలిచాడా.. ఓడాడా?