/rtv/media/media_files/2025/03/03/gdV9oTltJHke67QCQ4BC.jpg)
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయమని ఆ పార్టీ నాయకులు కేసీఆర్ దగ్గరకొచ్చారని కవిత మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పినా.. ఆ దెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని పరోక్షంగా కేసీఆర్ని ఎద్దేవా చేశారు. అది బీఆర్ఎస్ కాదు.. డీఆర్ఎస్( దెయ్యాల రాష్ట్ర సమితి)అని బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్ వాసాలమర్రికి వచ్చి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేశాడని రేవంత్ రెడ్డి అన్నారు. వాసాలమర్రిలో ఇండ్లు కూలగొట్టి స్మశానంగా మార్చాడని ఆరోపించారు.
Also Read : అఖిల్-జైనాబ్ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున
CM Revanth Reddy Spoke At Prajapalana-Pragatibata
కేసీఆర్ పాపాలు చేసిండు కాబట్టే కాలు జారి పడ్డాడు – రేవంత్ రెడ్డి pic.twitter.com/j6uWxSnIMr
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2025
Also Read : ప్రధాని మోదీకి G7 సమ్మిట్ ఆహ్వానం
పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తారట.. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తేనే కేసీఆర్ ఆగమాగం అయితుందని చెప్పారు. జవాబు చెప్పాల్సింది పోయి కేసీఆర్ విమర్శలు చేస్తు్న్నాడని చెప్పుకొచ్చారు. ఆలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. తిరుమల తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని ప్రకటించారు. యాదగిరిగుట్ట ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
Also Read : ‘ఆ దెయ్యాలకు నాయకుడు సమాధానం చెప్పాలి’
2024 నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవనం చేసి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు. మోదీ సబర్మతి, గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చు గానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా అని అన్నారు. నల్లగొండల బిడ్డలు మూసీ మురికి కూపంలో బ్రతకావాల్సిందేనా? ఈ గడ్డ చైతన్యానికి మారుపేరన్నారు. నిజాం నవాబులను తరిమిన చరిత్ర నల్లగొండది. ఎవరో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే నల్లగొండ బిడ్డలు చూస్తూ ఊరుకోరని ముఖ్యమంత్రి అన్నారు.
Also Read : బెంగళూరు తొక్కిసలాటలో ఏపీకి చెందిన 13 ఏళ్ల బాలిక మృతి.. బయటకొచ్చిన షాకింగ్ నిజం..!
brs | kcr | telangana | cm-revanth-reddy | kavitha | paleru-constituency | public-meeting | latest-telugu-news | prajapalana