Telangana Election: రేపు పాలేరుకు సీఎం కేసీఆర్.. పొంగులేటిపై పంచ్లు ఉంటాయా..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేయబోతోంది. రేపు (శుక్రవారం) పాలేరు నియోజకవర్గంలోని జీళ్లచెర్వు గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభతో ప్రచార భేరిని ప్రారంభించనుంది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానుండటంతో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.