/rtv/media/media_files/2025/06/06/6Zn5SzaX30JfuQhvM4YK.jpg)
కెనడాలో ఈ ఏడాది జూన్లో జరగబోయే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం అందింది. నరేంద్ర మోదీ 2019 నుంచి ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈఏడాది ఆయనకు ఆహ్వానం అందించడంలో ఆలస్యం అయ్యింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తూ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపమంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ జీ7కు ఆహ్వానించేందుకుప్రదాని మోదీకి ఫోన్ చేశారు. దీనికి స్పందించిన మోదీ తన హాజరును ధృవీకరించారు.
India invites PM Modi to G7 Summit
Glad to receive a call from Prime Minister @MarkJCarney of Canada. Congratulated him on his recent election victory and thanked him for the invitation to the G7 Summit in Kananaskis later this month. As vibrant democracies bound by deep people-to-people ties, India and Canada…
— Narendra Modi (@narendramodi) June 6, 2025
Also Read : రిటైర్మెంట్ ప్రకటించిన మరో భారత క్రికెటర్
కెనడాలోని కననాస్కిస్లో జూన్ 15 నుంచి 17 వరకు జరగబోయే జీ7 సదస్సుకు రావాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి కోరారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో పేర్కొన్నారు. ఈ నెల చివర్లో జరిగే జీ7 సమ్మిట్కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
Also Read : బికినీలో అనన్య బీచ్ అందాలు.. ఫొటోలు చూశారా!
g7-summit | latest-telugu-news | canada-india-relations | pm modi