G7 summit: ప్రధాని మోదీకి G7 సమ్మిట్‌ ఆహ్వానం

కెనడాలో ఈ ఏడాది జూన్‌లో జరగబోయే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం వచ్చింది. కెనడా కననాస్కిస్‌లో జూన్ 15 నుంచి 17 వరకు జరగబోయే సదస్సుకు రావాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ‍మోదీకి ఫోన్‌ చేసి కోరారు.

New Update
G7 summit

కెనడాలో ఈ ఏడాది జూన్‌లో జరగబోయే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం అందింది. నరేంద్ర మోదీ 2019 నుంచి ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈఏడాది ఆయనకు ఆహ్వానం అందించడంలో ఆలస్యం అయ్యింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పందిస్తూ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపమంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ జీ7కు ఆహ్వానించేందుకుప్రదాని మోదీకి ఫోన్‌ చేశారు. దీనికి స్పందించిన మోదీ తన హాజరును ధృవీకరించారు.

Also Read: Bunny Vasu OTT Controversy: పెద్ద హీరోలదే తప్పు.. థియేటర్ల వివాదం పై నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్!

India invites PM Modi to G7 Summit

Also Read :  రిటైర్మెంట్ ప్రకటించిన మరో భారత క్రికెటర్

కెనడాలోని కననాస్కిస్‌లో జూన్ 15 నుంచి 17 వరకు జరగబోయే జీ7 సదస్సుకు రావాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ‍భారత ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి కోరారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌‌లో పేర్కొన్నారు. ఈ నెల చివర్లో జరిగే జీ7 సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు.

Also Read:  Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?

Also Read :  బికినీలో అనన్య బీచ్ అందాలు.. ఫొటోలు చూశారా!

 

g7-summit | latest-telugu-news | canada-india-relations | pm modi

Advertisment
Advertisment
తాజా కథనాలు