/rtv/media/media_files/2025/06/06/DmnvNYuOA1NZXhsnfVss.jpg)
13 years girl of andhra pradesh died during rcb celebration at chinnaswamy stadium
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన విషాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పరిమితికి మించిన జనాభా రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలుకోల్పోయారు. ఈ మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 13 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాలికతో పాటు మరో 17 ఏళ్లు, 19 ఏళ్ల వయసున్న వారు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారంతా 40 ఏళ్ల లోపు వయస్సున్న యువకులే కావడం మరింత విషాదకరం.
Also Read : వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు
మృతుల్లో ఏపీ బాలిక
ఇక ఈ మృతుల జాబితాలో దివ్యాన్షి (13), శివలింగ (17), చిన్మయి (19), ప్రజ్వల్ (20), శ్రవణ్ (20), భూమిక్ (20), సహనా (25), అక్షత (27), దేవి (29), దొరేషా (32), మనోజ్ (33) ఉన్నారు. ఈ మృతుల్లో ఏపీకి చెందిన 13 ఏళ్ల దివ్యాన్షి అనే బాలిక కూడా ఉంది.
#ArrestKohli
మరోవైపు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ విరాట్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత పెరుగుతోంది. ట్విట్టర్ (ఎక్స్) లో #ArrestKohli అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం గమనార్హం. చాలా మంది నెటిజన్లు కోహ్లీని అరెస్టు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కోహ్లీ కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగాక అతడు తన భార్యతో లండన్ వెళ్లి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
మ్యాచ్ గెలిచినపుడు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు తన అభిమానులు చనిపోతే కనీసం స్పందించలేదని విమర్శలు గుప్పిస్తు్న్నారు. మరికొందరేమో కోహ్లీకి బాధ్యత ఉందని.. ఈ విజయోత్సవ వేడుకకు ముఖ్య కారణం అతడేనని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ‘అరెస్ట్ విరాట్ కోహ్లీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడంతో కోహ్లీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కాగా ఇంకా ఈ వివాదం ముదిరే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
Also Read: భారత్లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
rcb fans stampede | Bengaluru Stampede