/rtv/media/media_files/2025/06/08/eKDm9pUvXpT1oue45WPK.jpg)
CM Revanth
హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ '' ప్రజలకథే నా ఆత్మకథ'' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ హా--జరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' దత్తా్త్రేయ గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్ వరకు ఎదిగారు. ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. పేదలు చేసుకొనే చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యేవారు.
Also Read: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యం.. కొనసాగుతున్న భారత్, మంగోలియా సంయుక్త మిలటరీ డ్రిల్..
Also Read : నన్ను చూసి హస్త ప్రయోగం చేసుకున్నాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Revanth Reddy Speech At Dattatreya Event
దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నా పాఠశాల చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో, ప్రస్తుతం ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నానని ఇటీవలే ప్రధాని మోదీకి చెప్పాను. నాకున్నటువంటి సన్నిహిత సంబంధాలను ఎప్పుడూ కూడా దాచుకోను. మంత్రివర్గ విస్తరణ ఉన్నాకూడా ఈ కార్యక్రమం పూర్తవ్వగానే దత్తా్త్రేయ కోసం ఇక్కడికి వ్చచాను. అటల్ బిహారీ వాజ్పేయ్కి జాతీయ రాజకీయాల్లో ఉన్న గౌరవం.. రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉంది. ఆయన చేపట్టే అలయ్ బలయ్ కార్యక్రమే తెలంగాణ ఉద్యమానికి స్పూర్తని'' రేవంత్ అన్నారు.
Also Read: రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్..అఖిలేష్ యాదవ్ సహా 300మంది అతిథులు
ఇదిలాఉండగా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లతో పాటు తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి ఈ వేదిక గవర్నర్ల పరేడ్ల ఉందని రేవంత్ అన్నారు. అలాగే కాంగ్రెస్లోని మంత్రివర్గం మొత్తం ఇక్కడే ఉందని.. తాము కేబినెట్ మీటింగ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చని సరదాగా అన్నారు.
Also Read: రణ రంగంగా లాస్ ఏంజెలెస్..2వేల మంది నేషనల్ గార్డ్స్ ను దింపిన ట్రంప్
rtv-news | bandaru-dattatreya | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news