Gachibowli Lands : రేవంత్‌ రెడ్డికి బిగ్ షాక్... కేంద్ర సాధికార కమిటీ సంచలన రిపోర్ట్‌

కంచ గచ్చిబౌలి  భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.అవి అటవీ భూములు కావన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర సాధికార కమిటీ సంచలన సిఫారసు చేసింది. ఆ భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించి నిర్వహణను తెలంగాణ అటవీ శాఖకు అప్పగించాలని సూచించింది.

New Update
HCU land issue 123

Gachibowli Lands : కంచ గచ్చిబౌలి  భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.అవి అటవీ భూములు కావని, అక్కడ ఎలాంటి జంతువులు లేవని పేర్కొన్న  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర సాధికార కమిటీ సంచలన సిఫారసు చేసింది. ఆ భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించి నిర్వహణను తెలంగాణ అటవీ శాఖకు అప్పగించాలని సూచించింది. అలాగే, అక్కడున్న జీవ వైవిధ్యం దృష్ట్యా ఆ భూములను వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కిందకు తెచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించింది. కాగా ఈ భూములపై వివాదం నెలకొనడంతో హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Also Read :  పాకిస్థాన్‌ నుంచి తిరిగొచ్చిన భర్త.. గుర్తుపట్టలేకపోయానంటూ భార్య ఎమోషనల్

వారి ఆందోళనతో Central Empowered Committee (కేంద్ర సాధికార కమిటీ)  దర్యాప్తు చేపట్టింది. కాగా ఈ విషయమై గత నెలలోనే సుప్రీం కోర్టుకు మధ్యంతర నివేదిక ఇచ్చిన సీఈసీ తాజాగా తుది నివేదికను అందజేసింది. ఈ సందర్భంగా పలు కీలక సిఫారసులను కమిటీ సూచించింది. వేటిని అటవీ భూములుగా గుర్తించాలో నిపుణుల కమిటీ కొన్ని వైవిధ్యాల్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. అలాగే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయ పడిన కమిటీ  సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీ వేయాలని సూచించింది. ఆ కమిటీలో పీసీసీఎఫ్‌ (PCCF), సీసీఎల్‌ఏ (CCLA), న్యాయ నిపుణులు, పర్యావరణవేత్తలు ఉండేలా చూడాలని కోరింది.  ఇక అక్కడ వందలాది వృక్షాలను ప్రభుత్వం తొలగించిందని దాన్ని నిర్ధారించేందుకు అయిన రూ.14.52 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, ఆ మొత్తాన్ని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు వెంటనే చెల్లించాలని ఆదేశించింది.

Also read :  Miss World Competition : మిస్‌ వరల్డ్‌ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?

ఇంకా తన నివేదికలో కంచ గచ్చిబౌలి భూముల్లో సహజసిద్ధమైన చెట్లతో పాటు, అనేక రకాల చెట్లు, పచ్చదనం ఉన్నాయని పేర్కొన్నది. అక్కడ  జింకలు, నెమళ్లు, సరీసృపాలు స్వేచ్ఛగా సంచరిస్తాయని అలాంటి ప్రదేశాన్ని కాపాడాలని కోరింది. అక్కడ వందల రకాల వృక్ష జాతులతో పాటు  నాలుగు కుంటలు ఉన్నాయని తెలిపింది. ఇక ‘ఆ ప్రాంతంలో ప్రభుత్వం కొట్టేసిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటి దట్టమైన పచ్చదనం పెంపొందించేలా చేయాలని అది కూడా వచ్చే వర్షాకాలంలోనే ఆ పని చేపట్టాలని కమిటీ సూచించింది.

Also Read :  హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!

కంచ గచ్చిబౌలి భూముల్లో భూసార, జల సంరక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టాలంది. అక్కడి జల వనరులన్నింటినీ వెట్‌ ల్యాండ్స్‌ సంరక్షణ, నిర్వహణ నిబంధనలు-2017 ప్రకారం సంరక్షించాలని కోరింది.  ఆ ప్రాంతంలో సరైన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను జీహెచ్‌ఎంసీ వచ్చే ఏడాది కాలంలో ఏర్పాటు చేయాలని’’ సూచించింది. అంతేకాక రాష్ట్రంలో ఉన్న అటవీ భూములను గుర్తించేందుకు గాను ఒక  నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించా లని కోరింది. ఆ కమిటీలో క్షేత్రస్థాయి అటవీ అధికారులు, వన్యప్రాణి నిపుణులు, జీవావరణవేత్తలు, ఐటీ, రిమోట్‌ సెన్సింగ్‌ నిపుణులు, సర్వే ఏజెన్సీలు ఉండేలా చూడాలని సూచించింది. ప్రైవేటు భూముల కంటే ప్రభుత్వ భూములను అటవీ ప్రాంతాలుగా గుర్తించే విషయంలో కమిటీ మరింత కఠినంగా ఉండాలని సిఫారసు చేశారు.

Also Read :  వేసవిలో చల్లదనాన్ని పంచే మామిడి ఫలూదా.. దీనిని సింపుల్‌గా ఇలా చేసుకోండి
 
రాజ్యాంగంలోని 48ఎ, 21 ప్రకరణల ప్రకారం ప్రభుత్వంపై ఆ బాధ్యత ఉందని తెలిపింది. అటవీ భూములు ఎక్కువగానే ఉంటాయని వాటిని గుర్తించే విషయంలో ఇబ్బంది లేదని, పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉండే వాటిని గుర్తించాలని పేర్కొంది, డీమ్డ్‌ ఫారెస్టుగా ఏ భూమిని గుర్తించాలన్న విషయంపై నిపుణుల కమిటీ ఈ తేడాను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది. అలాగే, సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా నెరవేర్చేలా ఈ కమిటీ పర్యవేక్షించాలని ఆదేశించింది. కాగా ఈ సిఫారసులు రాష్ర్ట ప్రభుత్వానికి మింగుడు పడని అంశమని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Also Read :  కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం..!
 

Advertisment
Advertisment
తాజా కథనాలు