Kancha Gachibowli : పర్యావరణ నష్టం పూడ్చలేకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సిందే... కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి.