/rtv/media/media_files/2025/05/06/7DiBEd31WwJQdKpYz3ic.jpg)
Miss World Competition
Miss World Competition : ప్రపంచ 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 31 వరకు రాష్ట్రంలో అందాల పోటీలు జరగనున్నాయి. తొలిసారి తెలంగాణలో నిర్వహిస్తున్న ఈ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టేపడేలా స్వాగత ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలువురు అందాల భామలు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఈ పోటీల్లో మన దేశం తరుపున ఎవరు పాల్గొంటున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇంతకు ఆమె ఎవరంటే నందిని గుప్తా.....
ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!
ఎవరీ నంది గుప్తా..?
"ఆల్ ఐస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఆన్ తెలంగాణ’ నినాదంతో హైదరాబాద్లో ఘనంగా ప్రారంభం కాబోయే అందాల పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల రాణులు కిరీటం కోసం పోటీపడబోతున్నారు. అందులో మనదేశం తరపున పోటీల్లో పాల్గొంటోంది నందిని గుప్తా. రాజస్థాన్కు చెందిన నందిని గుప్తా.. 2023, ఏప్రిల్ 15న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 పోటీల్లో విజేతగా నిలిచింది. తన ఆకట్టుకునే అందం, అద్భుతమైన తెలివితేటలు, దృడమైన ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలను మెప్పించి విజేతగా నిలిచింది నందిని గుప్తా. ఈ నేపథ్యంలోనే 72వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ తరుఫున ఎంపికైంది ఈ అందాల భామ.
తనను గురించి తను చెప్పుకుంటూ ఇటీవల మీడియా ముందు పలు ఆసక్తి విషయాలు వెల్లడించింది. చిన్నప్పుడు అందరూ ఏ డాక్టరో, ఇంజినీరో కావాలని కలలు కంటారు. కానీ నేను రాజకుమారిలా కిరీటం పెట్టుకోవాలని కలగన్నానంటోంది. అయితే మా అమ్మ కూడా మిస్ ఇండియా కావాలనుకుంది. కాలేకపోయింది. అందుకే తనకల, నా కల నేనే నేరావేర్చాలనుకున్నా, చిన్నతనంలోనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నానంది నందిని.
మాది రాజస్థాన్లోని కోటా. సాధారణ వ్యవసాయ కుటుంబం. నాన్న సుమిత్ గుప్తా, అమ్మ రేఖ. చెల్లి అనన్య. అందాల పోటీల గురించి నాన్నకేమీ తెలియదు. అయినా ఏనాడు మా ఇష్టాలను కాదనలేదు. అందుకే ఆయన నన్ను ఈ రంగంలో ప్రోత్సహించారు. చిన్నతనంలో సిగ్గిరిగా ఉన్న నేను మిస్ ఇండియా ప్రయాణంతో చాలా మారా. ధైర్యం, స్థిరత్వం, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా ఎదిగా. కొత్తవి నేర్చుకుంటూ పరిణతి సాధించేందుకు నన్ను నేను నిరంతరం మార్చుకున్నా. నా విషయానికొస్తే ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రాయ్, సినీ శెట్టి... అందరూ నాకు మెంటార్లే. నడక, మాట, స్టైల్... ఇవన్నీ వాళ్ల వీడియోలు చూసే నేర్చుకున్నా. నృత్యం, సినిమాలు, ప్రయాణాలు ఇష్టమైన అంశాలని తెలిపింది నందిని గుప్తా.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
రామప్ప సందర్శన
తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప అవకాశం లభించింది. ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ 2025 పోటీలు ఇక్కడ నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో, మిస్ ఇండియా 2023 నందిని గుప్తా ఇటీవల తెలంగాణలోని చారిత్రాత్మక రామప్ప ఆలయాన్ని సందర్శించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ అద్భుతమైన ఆలయానికి ఆమె సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక సాధారణ తెలుగు అమ్మాయి వలె లంగా ఓణీ ధరించి, స్థానిక సంస్కృతిని గౌరవిస్తూ ఆమె ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. శిల్పకళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయ నిర్మాణ శైలిని, దాని ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఆమె ఎంతో అభినందించారు. ఆలయ చరిత్రను అర్చకుల ద్వారా తెలుసుకున్నారు.
Also Read : దుబాయ్ లో భారత బిలయనీర్ కు ఐదేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
పోచంపల్లికి అందాల భామలు
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, సంస్కృతిని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. మిస్ వరల్డ్-2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి దాని సంక్లిష్టమైన ఇక్కత్ నేత పద్ధతులకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. పోచంపల్లిని యునెస్కో "ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామం"గా గుర్తించింది. ఇది చేతిపనులు, సంస్కృతి, వారసత్వానికి సజీవ మ్యూజియం.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్
hyderabad | nandini | telangana-govt | miss-world | miss-world-india