Operation karregutta: NAXAL FREE KARREGUTTA.. డీజీపీ సంచలన ప్రెస్ మీట్!

కర్రెగుట్టలు నక్సల్స్ ఫ్రీ గా మారాయని పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులను హతమార్చగా ఇందులో 16 మంది మహిళలున్నట్లు తెలిపారు. వారి ఫోటోలన్నింటినీ విడుదల చేయగా మృతులపై 1.72 కోట్ల రివార్డులున్నట్లు వెల్లడించారు.

New Update
karregutta

Operation karregutta

Encounter: కర్రేగుట్టలు నక్సల్స్ రహితంగా మారాయని పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులను హతమార్చగా ఇందులో 16 మంది మహిళలున్నట్లు తెలిపారు. వారి ఫోటోలన్నింటినీ విడుదల చేయగా మృతులపై 1.72 కోట్ల రివార్డులున్నట్లు వెల్లడించారు. 

Also Read :  హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!

కూంబింగ్ కొనసాగుతోంది..

కర్రెగుట్టలతోపాటు పరిసర అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోందని సీఆర్ పీఎఫ్ డీజీ తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్రేగుట్ట కొండలు ఇప్పుడు నక్సల్స్ రహితంగా మారినట్లు చెప్పారు. ఇప్పటివరకు31 మంది నక్సల్స్‌ హతమవగా.. వారి ఫోటోలన్నింటినీ విడుదల చేశామన్నారు. '2026లో దేశం నక్సల్స్ నుండి విముక్తి పొందుతుంది. తెలంగాణ నక్సల్స్ కమిటీని లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ CRPF పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. వ్యూహాం ప్రకారం ఆపరేషన్ నిర్వహించాం. ఏప్రిల్ 21 నుండి మే 11 వరకు ఆపరేషన్ కొనసాగింది. 18 మంది జవాన్లు గాయపడగా ఇప్పుడు వారంతా సురక్షితంగా ఉన్నారు. ఇక చనిపోయిన 31 మంది నక్సల్స్‌లో 16 మంది మహిళలున్నారు. ఇప్పటివరకు 28 మంది నక్సల్స్ మృతదేహాలను గుర్తించగా మరణించిన నక్సల్స్‌పై మొత్తం 1.72 కోట్ల రివార్డులన్నాయి' అని చెప్పారు. 

Also Read :  వేసవిలో చల్లదనాన్ని పంచే మామిడి ఫలూదా.. దీనిని సింపుల్‌గా ఇలా చేసుకోండి

ఇక భారీగా తుపాకులు, ఇతరత్రా సమాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  బీరు బాటిళ్లలో 450 IEDలను గుర్తించి ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇక ఇప్పుడు దేశంలో కేవలం 6 జిల్లాలు మాత్రమే నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉందని, మిగతా ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీని నామరూపాల్లేకుండా చేసినట్లు తెలిపారు. 

Also Read: KINGDOM: రౌడీ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!

మరోవైపు చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మవోయిస్టులపార్టీ మరోలేఖ విడుదల చేసింది. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్‌ పేరుతో లేఖ రిలీజ్ చేశారు. మోడీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ఆపరేషన్‌ కగార్‌ను ఆపడానికి ముందుకు రావాలని ప్రభుత్వాలు, ప్రజలను కోరింది. 

maoist | chattisaghad | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
తాజా కథనాలు